Home » వ్యూహం చిత్రంలో వై.ఎస్.భారతి పాత్రలో నటించింది ఎవరో తెలుసా ?

వ్యూహం చిత్రంలో వై.ఎస్.భారతి పాత్రలో నటించింది ఎవరో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

 ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతేడాది “వ్యూహం” అనే పొలిటికల్ చిత్రాన్ని ప్రకటించిన విషయం దాదాపు అందరికీ  తెలిసిందే. ఈ చిత్రంలోని పాత్రలు, వాటిలో నటించే నటీనటులను పరిచయం చేస్తూ.. ఇటీవలే  ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ అనే యువతి నటిస్తోంది. 

Advertisement

 జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తెస్తున్నాడు. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఆర్జీవీ. వైఎస్ జగన్ కి సంబంధించిన ఈ కథలో.. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? సీఎం అయ్యాక ఏం చేశారు అనే అంశాలతో ఈ రెండు సినిమాలు ఉండనున్నాయి.

Advertisement

ఇప్పటికే వ్యూహం సినిమా నుంచి టీజర్ విడుదల చేసి ఆసక్తి నెలకొల్పారు.  వ్యూహం సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో జగన్, భారతి, జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ. జగన్ గా నటుడు అజ్మల్ జీవించాడు అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది. చివర్లో చంద్రబాబు క్యారెక్టర్ తో పవన్ కళ్యాణ్ పై, జగన్ పై చెప్పిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వ్యూహం ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. మరి ఈ సినిమా రాజకీయంగా ఏపీలో ఎన్ని ప్రకంపనలు తెస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

విజయ్ ‘లియో’ కి ఊహించని షాక్.. ఇది కూడా అలాగేనా..?

‘శోభా.. నీకు ఎర్రగడ్డే దిక్కు’.. మోనితకు కౌంటర్ ఇచ్చిన భోలే..!

Visitors Are Also Reading