Home » బంగారం లాంటి అమ్మాయి.. 3 కోట్ల కట్నం..  తాళి కట్టడానికి ముందు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

బంగారం లాంటి అమ్మాయి.. 3 కోట్ల కట్నం..  తాళి కట్టడానికి ముందు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా తమ కూతురుకి  పెళ్లి చేయాలంటే ఆస్తి, అంతస్తులు, ఇలా సంతోషం అన్నింటి గురించి ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులు. అందుకోసం కోట్లాది రూపాయలు కట్నం చెల్లించి.. తమ కూతురుని అల్లుడిగారికి అప్పగిస్తారు. కోట్ల రూపాయల కట్నం, మంచి కుటుంబం, అందమైన అమ్మాయి ఇక పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి. కానీ ఓ యువకుడు తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు. పెళ్లికి ముందే మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు.. పెళ్లి కుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు ప్రవర్తించిన విధానం నచ్చక పెళ్లినే రద్దు చేసుకున్నారు. ఇప్పటివరకు తీసుకున్నటువంటి ఆభరణాలు, పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిన డబ్బులు తిరిగివ్వాలని అమ్మాయి తరుపువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read :  మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!

Advertisement

వివరాల్లోకి వెళ్లితే.. జూబ్లీహిల్స్ లో నివాసం ఉండే ఓ యువతి (24) తమ ఫ్యామిలీకి చిత్తూరులో ఉండే  ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి, తేజ స్వీట్స్ అధిపతి రవిబాబు కుటుంబంతో కామన్ ఫ్రెండ్ ద్వారా పరచయం ఏర్పడింది. దీంతో కొడుకు వైష్ణవ్ (27)తో పెళ్లి సంబంధం ప్రతిపాదనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. రూ.3కోట్లు కట్నం ఇవ్వాలని.. వివాహాన్ని గ్రాండ్ గా డెస్టినేషన్ మ్యారేజ్ లా చేయాలని వైష్ణవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో తిరుపతిలోని తాజ్ హోటల్ లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ఎంగేజ్ మెంట్ రద్దు చేశారు వైష్ణవ్ కుటుంబ సభ్యులు. ఇక ఆ తరువాత నవంబర్ 20, 2023న లగ్న పత్రిక రాసుకున్నారు.  

Also Read :  భర్త ఇంట్లో లేని సమయంలో…. భార్యలు చేయకూడని తప్పులు ఇవే!

Advertisement

ఆ సమయంలో రూ.6లక్షల విలువ చేసే డైమాండ్ రింగ్, రూ.2లక్షల విలువైన రోలెక్స్ వాచ్, రూ.2లక్షల విలువైన ఓ బంగారు గొలుసు వైష్ణవ్ కి పెళ్లి కూతురు కుటుంబీకులు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 09న మొయినాబాద్ లోి బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ లో వైష్ణవ్ తో యువతికి పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారు. రూ.50లక్షలు ఖర్చు చేశారు. ఫిబ్రవరి 07న సంగీత్ కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభించారు. అప్పటికే వైష్ణవ్ తేజ్ తో పాటు అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి మద్యం సేవించారు. పీలక వరకు తాగిన వైష్ణవ్.. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చోటుకు వెళ్లి కొరియోగ్రాఫర్ తో పాటు ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి పెళ్లికూతురు వైష్ణవ్ ని నిలదీసింది. దీంతో వీరిద్దరి మధ్య మాటమాట పెరిగింది. వీరికి ఫ్రెండ్స్ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. 

Also Read :  ఇండియ‌న్ క్రికెట‌ర్స్ వారి అంద‌మైన భార్య‌లు!

మరోసారి గొడవ కాాాగా.. పెళ్లి కూతురిపై వైష్ణవ్ దాడికి పాల్పడ్డాడు. పెళ్లి కూతురుని వైష్ణవ్ *తు మాటలు తిట్టారు. ఆమె కళ్ల ముందే *ద్యం తాగడంతో పాటు *గ్స్ తీసుకుంటూ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. పెళ్లి కూతురు సోదరుడిపై దాడికి దిగాడు. దీంతో అతడిని పెళ్లి చేసుకోనని పెళ్లి కూతురు తేల్చేసి చెప్పింది. ఇరు వర్గాల పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. పెళ్లి కోసం చేసిన ఖర్చు రూ.50లక్షలు, తమకు పెట్టిన ఆభరణాలను తిరిగి ఇస్తామని చెప్పిన వైష్ణవ్ కుటుంబీకులు ముఖం చాటేశారు. రెండు నెలలు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఫోన్ లో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైష్ణవ్ తో పాటు అతని తండ్రి రవిబాబు, తల్లి దేవి, బంధువులు తేజు, శ్రవణ్, శరత్ కుమార్ రెడ్డి పై ఐపీసీ 354, 420, 406, 506 సెక్షన్లతో పాటు వరకట్న నిషేద చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read :  Vidudhala Part 1 Review – ‘విడుదల’ రివ్యూ..అంచనాలకు మించి ఉందిగా !

Visitors Are Also Reading