Home » సాహా ఎమోషనల్… ఇక నా కెరియర్ ముగిసిపోయింది..!

సాహా ఎమోషనల్… ఇక నా కెరియర్ ముగిసిపోయింది..!

by Azhar
Ad

భారత జట్టు సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ఎమోషల్ అయ్యాడు. ఇక తన అంతర్జాతీయ కెరియర్ ముగిసిపోయింది అన్నాడు. అయితే భారత టెస్ట్ జట్టుకు ప్రధాన కీపర్ గా ఉండే సాహా… పంత్ వచ్చిన తర్వాత రెండో కీపర్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు పూర్తిగా జట్టు నుండే తొలగించబడ్డాడు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 లో అద్భుతంగా రాణించిన మరో సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కు టీం ఇండియాలోకి తీసుకున్నారు. కానీ ఇందులో రాణించిన సాహాను మాత్రం సెలక్టర్లు పట్టించుకోలేదు.

Advertisement

ఇక తాజాగా ఇదే విషయం పై సాహా మాట్లాడుతూ… నాకు టీమ్ ఇండియా కోచ్, చీఫ్ సెలెక్టర్ ముందే చెప్పారు. ఇక నన్ను జాతీయ జట్టులోకి తీసుకోము అని. ఒకవేళ తీసుకునే వాళ్ళు అయితే ఇప్పటికే తీసుకునేవాళ్ళు. ఐపీఎల్ లో రాణిస్తే తీసుకుంటారు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నన్ను ఐపీఎల్ చూసి తీసుకునే వారు అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయాల్సింది. కానీ నాతో పాటు మరికొందరు సీనియర్లను ఎంపిక చేయకపోవడంతో నా అంతర్జాతీయ కెరియర్ ముగిసిపోయింది అని నాకు అర్ధం అయ్యింది.

Advertisement

అయితే నన్ను టీం ఇండియాలోకి తీసుకోలేదు అని నేను రిటైర్మెంట్ మాత్రం ప్రకటించను. ఇండియాకు ఆడలేకపోతే ఐపీఎల్, దేశవాళీ టోర్నీలలో ఆడుతాను. తప్ప క్రికెట్ ను మాత్రం వదిలిపెట్టను అని సాహా అన్నాడు. అయితే ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో టైటిల్ గెలిచినా గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడిన సాహా… 11 మ్యాచ్ లలో మూడు హాఫ్ సెంచరీలతో 317 పరుగులు చేసాడు. అలాగే జట్టు విజయాలలో కీలక పాత్ర కూడా పోషించాడు అనే విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఇండియా – పాక్ మ్యాచ్ పై వైరల్ అవుతున్న హర్భజన్ కామెంట్స్..!

బీసీసీఐకి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ…!

Visitors Are Also Reading