Home » వెండి పట్టీలని ఆడవాళ్లు ఎందుకు పెట్టుకోవాలి..? ఏం జరుగుతుంది..?

వెండి పట్టీలని ఆడవాళ్లు ఎందుకు పెట్టుకోవాలి..? ఏం జరుగుతుంది..?

by Sravya
Ad

ఆడవాళ్లు కచ్చితంగా కాళ్ళకి పట్టీలు పెట్టుకోవాలని, అందులోనూ బంగారం ఇతర మెటీరియల్స్ తో కాకుండా వెండితో తయారుచేసిన పట్టీలు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలా సార్లు మనకి చెప్తూ ఉంటారు. అయితే అసలు ఆడవాళ్లు ఎందుకు కాళ్ళకి వెండి పట్టీలు ని పెట్టుకోవాలి..? పెట్టుకోవడం వలన కలిగే లాభం ఏంటి దీని వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వెండి శరీరానికి చలవ చేస్తుంది వెండి వస్తువులని పెట్టుకోవడం వలన శరీరం లో ఉన్న వేడి బయటకు వెళ్ళి పోతుంది.

Advertisement

Advertisement

ఈ కారణం గానే కాళ్ళ కి బంగారం కంటే కూడా వెండితో చేసిన వాటిని పెట్టుకుంటే మంచిది వెండి తో చేసిన పట్టీలను పెట్టుకోవడం వలన నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఉండవు. అయితే కొంతమంది బంగారు పట్టీలు పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. లక్ష్మీ దేవి కి పసుపు రంగు చాలా ఇష్టం. బంగారం కూడా ఇదే రంగులో ఉంటుంది బంగారంతో చేసిన వేటినైనా కూడా కాళ్ళకి పెట్టుకోవడం మంచిది కాదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading