Home » తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి పై ఎన్టీఆర్, క‌ల్యాణ్ రామ్ ఎందుకు స్పందించ‌లేదు..? కార‌ణం ఇదేనా..?

తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి పై ఎన్టీఆర్, క‌ల్యాణ్ రామ్ ఎందుకు స్పందించ‌లేదు..? కార‌ణం ఇదేనా..?

by AJAY
Ad

నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న‌ ఇటీవల గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేరిన సంగతి తెలిసిందే. తార‌క‌ర‌త్న నారాలోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. ఆ పాద‌యాత్ర మొద‌టి రోజే తార‌క‌ర‌త్న గుండె పోటు రావ‌డంతో ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయారు. దాంతో వెంట‌నే కార్య‌క‌ర్త‌లు తార‌క‌ర‌త్న‌ను ఆస్ప‌త్రిలో చేర్చింరు. కాగా అప్ప‌టికే ఆగిపోయిన తార‌క‌ర‌త్న గుండెను వైద్యులు సీపీఆర్ ద్వారా మ‌ళ్లీ ప‌నిచేసేలా చేశారు.

Advertisement

కానీ చాలా సేపు గుండె ఆగిపోవ‌డంతో తార‌క‌ర‌త్న మొద‌డు పై ప్ర‌భావం ప‌డ‌టంతో ఆయ‌న కోమాలోకి వెళ్లారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు బెంగుళూరులో నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికే తార‌క‌ర‌త్నను కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. ఎన్టీఆర్, క‌ల్యాణ్ రామ్ కూడా ఫ్యామిలీతో వెళ్లి తార‌క‌ర‌త్న‌ను ప‌రామ‌ర్శించారు.

Advertisement

అయితే రీసెంట్ గా క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన అమీగోస్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు పాల్గొన్నారు. కానీ ఈవెంట్ లో తార‌క‌ర‌త్న ఆరోగ్య‌ప‌రిస్థితి గురించి మాత్రం మాట్లాడ‌లేదు. దాంతో అలా ఎందుకు చేశారు అని అభిమానుల‌ను ప్రేక్ష‌కుల్లో అనుమానం మొద‌లైంది.

అయితే తార‌క‌ర‌త్న ఆరోగ్యం గురించి వారు మాట్లాడ‌క‌పోవ‌డానికి ఓ కారణం ఉంది. సినిమా ఈవెంట్ లో తార‌క‌ర‌త్న హెల్త్ గురించి మాట్లాడితే స్పీచ్ లో అదే హైలెట్ అవుతుంది. దాంతో సినిమా ప్ర‌మోష‌న్ కూడా పెద్ద‌గా జ‌ర‌గ‌దు. అందువ‌ల్లే ఎన్టీఆర్ మాట్లాడాల‌ని ఉన్నా కూడా కంట్రోల్ చేసుకున్నార‌ట‌. అంతే కాకుండా తార‌క‌ర‌త్న హెల్త్ పై కూడా ఎలాంటి అప్డేట్ లేక‌పోవ‌డంతో ఇద్ద‌రూ మాట్లాడ‌లేద‌ని టాక్.

also read: వెంక‌టేష్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ల మ‌ధ్య గ్యాప్ ఎందుకు వ‌చ్చింది..? ఆ గొడ‌వ‌ల‌కు కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading