Home » NTR 100 rs కాయిన్ లాంచ్ ఫంక్షన్ కి తారక్ అందుకే హాజరు కాలేదా?

NTR 100 rs కాయిన్ లాంచ్ ఫంక్షన్ కి తారక్ అందుకే హాజరు కాలేదా?

by Srilakshmi Bharathi
Ad

నట సార్వభౌముడు, దివంగత సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనను స్మరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపాయల కాయిన్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నేడు ఈ కాయిన్స్ ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేసారు. ఈ ఫంక్షన్ రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు. రేపటి నుంచి ఈ కాయిన్స్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అయితే, ఈ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. దీనితో, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదు అన్న విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

గ్రేట్ ఆంధ్ర నివేదిక ప్రకారం, ఈ గ్రాండ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. అయితే, అతను తన రాబోయే చిత్రం దేవర షెడ్యూల్ కారణంగా ప్రత్యేక ఫంక్షన్ కి హాజరు కాలేదు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తారక్‌తో పాటు కళ్యాణ్ రామ్‌ను కూడా ఇన్వైట్ చేశారట. అయితే ఆయన కూడా ఈవెంట్ కు రాలేదు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి సహా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఈ కొత్త వంద రూపాయల నాణేలు 44 మిమీ వ్యాసం, 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్ మరియు 5 శాతం జింక్‌తో తయారు చేయబడ్డాయి. ఈ నాణెం పై ‘నందమూరి తారక రామారావు శత జయంతి’ అనే శాసనంతో పాటు మూడు సింహాలు మరియు ఒక వైపు అశోక చక్రం మరియు మరొక వైపు ఎన్టీఆర్ స్వరూపం కూడా కనిపిస్తాయి.

మరిన్ని..

నాగార్జున, అమల పెళ్లికి ఏఎన్నార్ దూరంగా ఉండటానికి కారణం ఏంటి ? ఆ నిర్మాతే వీరి పెళ్లి చేశాడా ?

అన్వేష్ ప్రేమ- పెళ్లి- విడాకులపై కీలక వ్యాఖ్యలు!

మినిస్టర్ రోజా భర్త సెల్వమణికి అరెస్ట్ వారెంట్…!

Visitors Are Also Reading