Home » ఆదిపురుష్ పై హీరోయిన్ కృతిసనన్ ఏమన్నారంటే..?

ఆదిపురుష్ పై హీరోయిన్ కృతిసనన్ ఏమన్నారంటే..?

by Anji
Ad

మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి హీరోయిన్ గా మారిన అందాల భామ కృతిసనన్. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే తోసినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ వాలే, లూకా చప్పీ, మిమి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ సిర్థపడిపోయారు. తాజాగా పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటించారు. ఈ సినిమా పై ఆసక్తికరమైన కామెంట్లు చేసారు. 

Advertisement

కృతిసనన్ తాజాగా షెహజాదా లో నటించారు. కార్తిక్ ఆర్యన్ కు జోడిగా కనిపించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న విడుదల అయింది. ఈ నేపథ్యంలో కృతి షెహజాదా ప్రమోషన్స్ లలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్స్ లో ఆదిపురుష్ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ ప్రపంచ వ్యాప్తంగా ‘ఆదిపురుష్’ జూన్ 16 విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో నటించినందుకు నాకు గర్వంగా ఉంది. ఓంరౌత్ అద్భుతంగా తెరకెక్కించారు. దేశం మొత్తం గర్విస్తుందని నేను ఆశిస్తున్నాను” అని కృతిసనన్ చెప్పారు. రామాయణాన్ని ఆధారంగా ‘ఆదిపురుష్’  ని రూపొందించారు. 

Advertisement

టీ-సిరీస్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించింది. ఇందులో సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. కొద్ది రోజుల కిందట అయోధ్యలో సినిమా టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్ ఆశించిన స్థాయిలో లేవని చాలా మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. దీంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేశారు. జూన్ 16న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అదే రోజు హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ప్లాష్ థియేటర్లలో విడుదల కానుంది. 

 Also Read :  Sir Movie Review in Telugu : ధనుష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..? ‘సార్’ ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading