ప్రముఖ నటుడు శరత్ బాబు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న శరత్ బాబు కన్నుమూసినట్లుగా వార్తలు రావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అవి ఫేక్ వార్తలని ఆయన కుటుంబ సభ్యులు ద్రువీకరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా శరత్ బాబు చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వర్గాలు తాజాగా హెల్త్ అప్డేట్ విడదల చేశారు.
Advertisement
ఏఐజీ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు హెల్త్ కండీషన్ చాలా క్రిటికల్ గానే ఉందని చెప్పారు వైద్యులు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని.. దయచేసి ఎవ్వరూ కూడా వదంతులు వ్యాప్తి చేయకూడదని తెలుపుతూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. శరత్ బాబు కుటుంబం నుంచి లేదా అధికారిక AIG హాస్పిటల్స్ ప్రతినిధి నుండి వచ్చే వార్తలను మాత్రమే నమ్మండి అని పేర్కొన్నారు. మీడియా మిత్రులకు ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము అని డాక్టర్లు తెలిపారు.
Advertisement
అనారోగ్యం బారిన పడిన తర్వాత కొన్ని రోజులపాటు బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న శరత్ బాబును.. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని.. ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. ఇంతలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారనే ప్రచారం జరగడంతో ఆసుపత్రి వర్గాలతో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు శరత్ బాబు హెల్త్ పై ఆయన సోదరి క్లారిటీ ఇచ్చారు. “సోషల్ మీడియా లో శరత్ బాబు గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయని, శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యి, రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు” అని నా విజ్ఞప్తి అని పేర్కొన్నారు.
Also Read : శరత్ బాబు చనిపోలేదు.. చికిత్స జరుగుతుంది శరత్ బాబు సోదరి..!!