ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ఇటీవలే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ సినిమాలో నటించబోతున్నాడు. అంతేకాకుండా ఇప్పటికే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేశాడు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ను ఈ స్థానంలో నిలబెట్టేందుకు తండ్రి హరికృష్ణ కూడా ఎంతో కష్టపడ్డారు.
Advertisement
Also Read: వెంకటేష్ భార్య నీరజ గార్ల పెళ్లి వెనుకున్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?
సినిమా వాళ్ళు సాధారణంగా తమ కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. చిరంజీవి, అల్లు అరవింద్, సూపర్ స్టార్ కృష్ణ అలా శ్రద్ధ తీసుకున్న వారే… టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మాణంలో కుర్ర హీరోలు ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతారని ఓ సెంటిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి రామ్ చరణ్ ను చిరుత సినిమాతో ఎంట్రీ ఇప్పించాడు. ఈ సినిమాను అశ్వినీ దత్ నిర్మించారు.
Advertisement
అదేవిధంగా మహేష్ బాబుతో రాజకుమారుడు సినిమా అల్లు అర్జున్ తో గంగోత్రి సినిమాలను కూడా అశ్విని దత్ నిర్మించి వారికి సూపర్ హిట్స్ అందించాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన మొదటి సినిమాను ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో నిన్ను చూడాలని అనే సినిమాలో నటించారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
Also Read: రిలేషన్ షిప్ ఎంత ముఖ్యమో నాకు అర్థం అయ్యింది…నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్…!
దాంతో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రెండో సినిమాని మీ బ్యానర్ లోనే చేయాలని అశ్వినీ దత్ కు చెప్పారట. అంతే కాకుండా అనేకసార్లు ఈ విషయంపై హరికృష్ణ అశ్విని దత్ తో చర్చించారట. ఈ నేపథ్యంలో నే అశ్వినీ దత్ బ్యానర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా గజాల నటించింది. అలా ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ పడాలని హరికృష్ణ రెండో సినిమా కోసం కష్టపడ్డారు.
Also Read: పవన్ కళ్యాణ్, శ్రీజల జాతకాలలో 4 పెళ్లిళ్లు….వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు….!