మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించారు. అందులో ఒటకి ఠాగూర్ సినిమా..ఈ సినిమా కు ముందు చిరంజీవి ఇంద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దాంతో తరవాత సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. కాగా అదేసమయంలో చిరంజీవికి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన రమణ సినిమా గురించి తెలిసింది. ఈ సినిమాలో విజయ్ కాంత్ హీరోగా నటించగా అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది.
Advertisement
అదే కథతో వివి వినాయక్ దర్శకుడుగా చిరంజీవి రీమేక్ ను అనౌన్స్ చేశారు. ఆ సినిమానే ఠాగూర్ ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. అంతే కాకుండా ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో జ్యోతిక మరియు శ్రీయలు హీరోయిన్ లుగా నటించారు. సునీల్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించాడు.
ALSO READ : నితిన్ దిల్ సినిమా హీరోయిన్ గుర్తుందా..? పాపం ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందంటే..?
Advertisement
అయితే ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చిరంజీవి తో పాటూ రాజశేకర్ సైతం పోటీ పడ్డారు. కానీ అల్లు అరవింద్ మరియు చిరంజీవి గట్టిగా ప్రయత్నించడంతో రీమేక్ రైట్స్ వారి సొంతం అయ్యాయి. అంతే కాకుండా మెగాస్టార్ పిలిచి మరీ ఆఫర్ ఇవ్వడంతో వివి వినాయక్ ఈ సినిమాను ప్రెస్టేజియస్ గా తీసుకుని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం చాలా మంది జనాలు రావాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.
ALSO READ :వాట్సాప్ లో మరో కీలక అప్డేట్…ఇలా సెట్ చేసుకోండి..!
దాంతో ఆ సీన్ కు సరిపోయేలా ఉన్న లొకేషన్ చూసుకుని ఆ సీన్ ను తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో తీశారు. ఆ సీన్ లో ఈ సినిమాకు కెమెరా మెన్ లో పనిచేసిన చోటాకే నాయుడు తన ప్రతిభను చూపించారు. ఈ సీన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతే కాకుండా ఈ సినిమా చూసిన తరవాత పవన్ కల్యాణ్ చిరంజీవిని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారట. మీరు ఇలాంటి సినిమాలే చేయాలని కోరారట.
ALSO READ :సీనియర్ ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే… కుక్కలు, కోళ్లు అవుట్ అంతే…!