Home » సావిత్రిని చివరి రోజుల్లో అంతలా అవ‌మానించారా…? చివరికి భోజనం కూడా పెట్టకుండా..?

సావిత్రిని చివరి రోజుల్లో అంతలా అవ‌మానించారా…? చివరికి భోజనం కూడా పెట్టకుండా..?

by AJAY
Ad

మహానటి సావిత్రి అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సావిత్రి అభిమానులను సంపాదించుకున్నారు. అందం అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కానీ నమ్మిన వాళ్లే చివరికి సావిత్రిని నట్టేటముంచారు. దానధర్మాలు చేయడంతో పాటు నమ్మిన నమ్మిన వాళ్ల చేతిలోనే సావిత్రి దారుణంగా మోసపోయారు. చివరికి దిక్కు తోచని స్థితిలో ఆమె కన్నుమూశారు. అయితే ఇండస్ట్రీలో సావిత్రికి చాలామంది సన్నిహితులు ఉండేవారు. దివంగత నటులు గుమ్మడి కూడా సావిత్రికి చాలా సన్నిహితంగా ఉండేవారు.

Advertisement

ఆయన చివరి రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో సావిత్రి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో గుమ్మడి మాట్లాడుతూ… నేను సావిత్రి కి చాలా ఆత్మీయుడిని. నన్ను అన్నా అని పిలిచేది. ఆమె చివరి రోజుల్లో పడిన కష్టాలను స్వయంగా చూశాను. అందులో చేదు తీపి రెండు గుర్తులూ ఉన్నాయి. ఓ రోజు నేను అనారోగ్యం బారిన పడిన సమయంలో మంచంపై లేవలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు సావిత్రి వచ్చి నన్ను పలకరించింది. నా దిండు కింద‌ రెండు వేల రూపాయలను పెట్టింది.

Advertisement

కానీ నేనప్పుడు చూసుకోలేదు. డబ్బులు చూసి సావిత్రి కి ఫోన్ చేశాను. ఇలా చేసావ్ ఏంటమ్మా…. అని అడగ్గా నేను చనిపోయే లోపు ఎవరికీ బాకీ ఉండకూడదు అంటూ సావిత్రి చెప్పుకొచ్చింది. దాంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతేకాకుండా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సావిత్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. నేను నటిస్తున్న ఓ సినిమాలో తల్లి పాత్రలో సావిత్రి నటించింది.

ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యాహ్నం అందరికీ ఇంటి నుండి క్యారియర్లు వచ్చేవి. క్యారియర్లు రానివారికి ప్రొడక్షన్ వాళ్ళు భోజనం పెట్టేవారు. కానీ సావిత్రికి ఇంటి నుండి క్యారియర్ వచ్చేది కాదు. ప్రొడక్షన్ వాళ్ళు కూడా సావిత్రికి భోజనం పెట్టలేదు. ఒక దగ్గర ఖాళీగా కూర్చున్న సావిత్రిని చూసి నేను భోజనం చేయలేదా అని అడిగితే… లేదు అన్నా అని చెప్పింది. దాంతో కలిసి తిందామని పిలిచాను కానీ మొదట రానంది. నువ్వు రాకుంటే నేను కూడా భోజనం చేయనని చెప్పాను. దాంతో ఏడ్చుకుంటూ వ‌చ్చి నాతో క‌లిసి భోజనం చేసింది. ఒకప్పుడు సావిత్రి డేట్స్ కోసం ఎదురుచూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె చివరి రోజుల్లో ప్రొడక్షన్ వాళ్ళు సైతం సరిగ్గా పట్టించుకోలేదు. అంటూ గుమ్మడి సావిత్రి జరిగిన అవమానాన్ని గుర్తు చేశారు.

Visitors Are Also Reading