గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవలే సీనియర్ నటుడు కృష్ణంరాజు మరణవార్త మరిచిపోక ముందే టాలీవుడ్ సూపర్ హీరో కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి మరణించిన వార్త ఇండస్ట్రీని కలవరపెడుతోంది. సూపర్ స్టార్ కృష్ణకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఇందిరా దేవిని 1961లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఇక ఆ తరువాత 1969లో విజయ నిర్మలను కూడా పెళ్లి చేసుకున్నారు.
Also Read : సొంత విమానాలు ఉన్న తెలుగు హీరోలు..అన్ని కోట్లు పెట్టి కొన్నారా..?
Advertisement
అయితే కృష్ణ రెండవ భార్య విజయ నిర్మల గుండెపోటుతో 2019 జూన్ 27న మరణించింది.ఈ ఏడాది జనవరి నెలలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా అనారోగ్యం కారణంగా మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూయడంతో కృష్ణ మరింత కృంగిపోయాడనే చెప్పవచ్చు. దీంతో ఘట్టమనేని అభిమానులను ఓ సెంటిమెంట్ భయపడుతుంది. గత మూడు సంవత్సరాల వ్యవధిలోఈ కుటుంబం నుంచి ముగ్గురు స్టార్ సెలబ్రిటీస్ మరణించారు.
Advertisement
Also Read : చిరంజీవి, రామ్ చరణ్ కి లక్కీ తేదీ ఏదో తెలుసా..?
ముఖ్యంగా చిన్న వయసులోనే రమేష్ బాబు మరణించడం వారి కుటుంబానికి పెద్దలోటు అనే చెప్పవచ్చు. విజయ నిర్మల అనారోగ్య సమస్యతో ఎలా బాధపడిందో ఇందిరా దేవి కూడా అలాగే బాధపడింది. అదేవిధంగా రమేష్ బాబు కూడా అనారోగ్యంతో బాధపడి మరణించారు. మహేష్ తల్లి ఇందిరా దేవి మాత్రం గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా బాధపడుతూ వచ్చారు. కానీ ప్రాణాలు పోయేంత వరకు ఆరోగ్యం ఆమెకి క్షీణించలేదు. చనిపోయే వరకు కూడా యాక్టివ్గానే కొనసాగింది. ఆమె మరణిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఆయన కూడా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఘట్టమనేని అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి కూడా ఇలాగే అవుతుందా అని చర్చించుకోవడదం విశేషం.
Also Read : సింగర్ సునీత భర్త మీకు తెలుసా.. ఇప్పుడే ఎలా ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!