Home » సర్కారి వారి పాటకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం..!!

సర్కారి వారి పాటకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం..!!

Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట చాలా వైరల్ అవుతోంది. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ఒక పండగలా చేపడుతోంది. ఈ తరుణంలో జగన్ సర్కార్ మహేష్ బాబుకు శుభవార్త చెప్పింది. అది ఏంటో చూద్దాం..! సర్కారు వారి పాట మూవీకి సంబంధించి మే 7వ తేదీన యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Advertisement

ఈ సినిమాకు సంబంధించి టికెట్ల రేట్లు పెంపునకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనుమతిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల పాటు టికెట్ ల మీద నలభై ఐదు రూపాయల మేర పెంచుకోవచ్చని తెలియజేసింది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి జగన్ సర్కారు ఉత్తర్వులు రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రాధేశ్యాం మరియు త్రిబుల్ ఆర్, ఆచార్య మూవీస్ కు టికెట్ల రేట్లు విషయంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విజయం అందరికీ తెలిసినదే.

Advertisement

అయితే సర్కారు వారి పాట మూవీకి కూడా థియేటర్ల యాజమాన్యాలు టికెట్ రేట్లను పెంచనున్నాయి. అయితే గతంలో ముఖ్యమంత్రి జగన్ దగ్గరికి వెళ్లి టికెట్ల రేట్లు పెంచాలని కోరుతూ ఆయన అడగడం జరిగింది. దీంతో జగన్ ఆయా హీరోల నటించినటువంటి మూవీస్ కు సర్కార్ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని అనుమతులను జారీ చేసింది. కీర్తి సురేష్ కథానాయిక చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మరియు మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మించారు

ALSO READ;

శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఒక్క ఎపిసోడ్ ను ఎన్ని రోజులు షూట్ చేస్తారో మీకు తెలుసా..?

ఆ హీరోయిన్ విష‌యంలో బాల‌కృష్ణ ర‌వితేజ‌ను కొట్టారా..? అస‌లేం జ‌రిగింది..!

 

Visitors Are Also Reading