Home » జబర్దస్త్ కంటెస్టెంట్ ల గురించి సంచలన కామెంట్స్ చేసిన డైరెక్టర్.. ఏమన్నారంటే..!!

జబర్దస్త్ కంటెస్టెంట్ ల గురించి సంచలన కామెంట్స్ చేసిన డైరెక్టర్.. ఏమన్నారంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో ఫేమస్ అయిన షో ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పవచ్చు. ఈ షో ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల్లో టాప్ షో గా కొనసాగుతోంది. ఇందులో చేసిన కంటెస్టెంట్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు పొందారు. వీటిలో ముఖ్యంగా సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది తెలుగు అభిమానుల ప్రతి ఒక్కరి నోట్లో ఉండే పేర్లు. వీరంతా జబర్దస్త్ కార్యక్రమం ద్వారానే పరిచయమయ్యారు. ఇకపోతే ఈ జబర్దస్త్ కార్యక్రమం గురించి అందులో కంటెస్టెంట్ ల గురించి దర్శకుడు గీతాకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. దర్శకుడిగా పలు సినిమాలకు పని చేసినటువంటి గీతాకృష్ణ ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని సెలబ్రిటీల గురించి షాకింగ్ విషయాలు చెప్పారు..

Advertisement

ఈ తరుణంలోనే గత కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ కార్యక్రమం బూతుల షో అని, అందులో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయని, అన్నారు. ఈ జబర్దస్త్ కార్యక్రమం నాకు అస్సలు నచ్చదు అని, అసలు ఆ షో చూడనని తెలియజేశారు. అయితే జబర్దస్త్ ద్వారానే చాలా పేరు తెచ్చుకున్న హైపర్ ఆది సుధీర్ మీకు తెలుసా అని యాంకర్ అడగగా సుధీర్ ఎవరో నాకు తెలియదని, నేను ఆ కార్యక్రమం చూడనని వెల్లడించారు. ఈ విధంగా గీతాకృష్ణ మాట్లాడటంతో ఆయన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Advertisement

అయితే ప్రస్తుతం జబర్దస్త్ నుంచి స్టార్ కంటెస్టెంట్ లు బయటకు వెళ్లడం గురించి ఆయన మాట్లాడుతూ, ఎవరికైనా మంచి కెరియర్ ఉంటుందని భావిస్తే ఒక కార్యక్రమాన్ని వదిలిపెట్టి మరో దాంట్లో కి పోతే తప్పేముంది అన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో వెకిలి నవ్వు నవ్వితె మాత్రం సినిమాల్లో అవకాశాలు రావని, జబర్దస్త్ కంటెస్టెంట్ ల గురించి చాలా షాకింగ్ విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

also read;

సినిమా అంటే తెలియని రోజుల్లోనే..లక్ష రెమ్యునరేషన్ తీసుకున్న తొలితరం సూపర్ స్టార్..?

బాలనటులుగా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన.. వారు ఎవరంటే..?

 

Visitors Are Also Reading