Home » నా చివరి కోరిక అదొక్కటే.. మాజీ మంత్రి తుమ్మల..!!

నా చివరి కోరిక అదొక్కటే.. మాజీ మంత్రి తుమ్మల..!!

by Sravanthi Pandrala Pandrala
Ad
 తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తన చివరి కోరిక ఏంటో  తెలియజేశారు.. ఆ ఒక్క కోరిక తీరితే  చాలని  ఆయన అన్నారు.. ఇంతకీ ఆయన కోరుకున్న కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. గోదావరి నీళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను  సస్యశ్యామలం చేయడమే తన యొక్క చివరి కోరిక అని  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తెలియజేశారు.
మణుగూరులో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్  సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  సీతారామ ప్రాజెక్టుతో తమ కల నెరవేరుతుందని,  జాతీయ రహదారులతో గోదావరి పర్యటన ప్రాంతంలో రూపురేఖలు మారనున్నాయని తెలియజేశారు. సాగునీటి ప్రాజెక్టులు జాతీయ రహదారులు  మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వంటి పథకాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాటలో నడుస్తున్నది తెలియజేశారు.
తెలంగాణ సర్కార్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఇలాంటి పాలన కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని కొనియాడారు. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ సత్తా చాటబోతోందని,  మళ్లీ పినపాకలో రేగా కాంతారావును గెలిపించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు తుమ్మల.

Advertisement

Visitors Are Also Reading