Home » భీమ‌వ‌రం బ‌రిలో సునీల్…ప‌వ‌న్ తో మీటింగ్ త‌ర‌వాత క్లారిటీ ఇచ్చేశాడు..!

భీమ‌వ‌రం బ‌రిలో సునీల్…ప‌వ‌న్ తో మీటింగ్ త‌ర‌వాత క్లారిటీ ఇచ్చేశాడు..!

by AJAY
Ad

టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న క‌మెడియ‌న్స్ లో సునీల్ కూడా ఒక‌రు. కెరీర్ ప్రారంభంలో సునీల్ క‌మిడియ‌న్ గా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. కానీ మ‌ర్యాద రామ‌న్న సినిమా త‌ర‌వాత హీరోగా అవ‌కాశాలు రావ‌డంతో సునీల్ హీరోగానే సినిమాలు చేయ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో క‌మెడియ‌న్ గా ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చినా ప‌క్క‌న పెట్టేశాడు. అలా సునీల్ కెరీర్ లో వెన‌క‌బ‌డ్డాడు.

Advertisement

ప్ర‌స్తుతం క‌మెడియ‌న్ విలన్ ఇలా అన్ని పాత్ర‌లు చేస్తూ మంచి న‌టుడిగా దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండ‌గా రీసెంట్ గా సునీల్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయ్యారు. దాంతో సునీల్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం నుండి జ‌న‌సేన అభ్య‌ర్థిగా బ‌రిలో దింపే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వినిపించాయి. సునీల్ ది భీమ‌వ‌రం కావ‌డం అక్క‌డ మంచి ఫాలోయింగ్ ఉండ‌టంతో జ‌న‌సేనలోకి తీసుకుని భీమ‌వ‌రం నుండి పోటి చేయించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి.

Advertisement

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ తో మీటింగ్ గురించి సునీల్ తాజాగా స్పందించారు. త‌నకు రాజ‌కీయాలకు క్వాలిఫైడ్ ప‌ర్స‌న్ కాదు అని అన్నారు. కానీ త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే చాలా ఇష్ట‌మని సునీల్ తెలిపారు. త‌న‌ను చింర‌జీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తారని అన్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు న‌న్ను పార్టీలోకి తీసుకోవాల‌ని మ‌న‌సులో నిజంగానే ఉంది. కానీ నాకే ఇష్టం లేదు అని అన్నారు.

మ‌న జ‌నాభా ఎక్కువ మ‌న‌కు వ‌చ్చే ఫండ్స్ త‌క్కువ అని చెప్పారు. కాబ‌ట్టి ఫండ్స్ అడ్జెస్ట్ చేయ‌డంలో కొంద‌రికి న్యాయం జ‌ర‌గ‌క‌పోతే హ‌ర్ట్ అవుతారు. అలాంటప్పుడు ఒకరితో మాట ప‌డ‌టం ఎందుకు. నన్ను అన్న‌య్య చిరంజీవి కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కానీ ప్రోత్స‌హించ‌డానికి రెడీగా ఉన్నారు కానీ మ‌నం వస్తే చ‌ప్ప‌ట్లు కొట్టి విజిల్స్ వేయాలి అలాంటి ప‌రిస్థితి లేక‌పోతే బాధ‌గా ఉంటుంద‌ని..పవ‌ణ్ క‌ల్యాణ్ కు కూడా అదే చెప్పాన‌ని అన్నారు.

Visitors Are Also Reading