Sumanth : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి సంబంధించిన హీరోలకు క్రేజ్ రేంజ్ లో ఉంటుంది. అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికే అక్కినేని నాగార్జున, నాగచైతన్య మరియు అఖిల్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక ఇదే కుటుంబానికి చెందిన యార్లగడ్డ సుమంత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేశాడు యార్లగడ్డ సుమంత్ కుమార్. ప్రేమ కథ, యువకుడు, పెళ్లి సంబంధం, స్నేహమంటే ఇదేరా అలాంటి ఎన్నో సినిమాలు చేశాడు హీరో సుమంత్. కానీ సత్యం, గౌరీ, గోదావరి మరియు చిన్నోడు లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు సుమంత్. ఇది ఇలా ఉండగా… అప్పట్లో హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హీరో సుమంత్. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాతో కీర్తి రెడ్డికి పాపులారిటీ వచ్చింది. అయితే ఆ సినిమా సమయంలోనే… కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుమంత్.
Advertisement
Advertisement
అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుని… రెండు సంవత్సరాల తర్వాత… విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వేరువేరుగా జీవితాన్ని గడిపిస్తున్నారు. అయితే.. తాజాగా కీర్తి రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో సుమంత్. మేము విడాకులు తీసుకున్నప్పటికీ… తరచు ఫోన్లో మాట్లాడుకుంటామని.. ఇద్దరం చాటింగ్ కూడా చేసుకుంటామని చెప్పుకొచ్చాడు హీరో సుమంత్. వారంలో కచ్చితంగా ఒకసారైనా ఫోన్ లో మాట్లాడుకుంటామని హీరో సుమంత్ వెల్లడించాడు. దీంతో హీరో సుమంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా, కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
పెళ్లైన 5 నెలలకే విడాకులకు రెడీ అయిన టాలీవుడ్ డైరెక్టర్ ?
Rajinikanth : గుడిలో పూజారికి దక్షిణ వేసిన తలైవా రజనీకాంత్
Chandrababu Arrest : చంద్రబాబు కు 10 ఏళ్ల జైలు శిక్ష ..!