Home » మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీలోకి సుధీర్..?

మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీలోకి సుధీర్..?

by Azhar
Ad

శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ఇప్పుడు ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది అనే విషయం అందరికి తెలుసు. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్నా అందరూ ఇప్పుడు ఈ షోలో కనిపిస్తుండటంతో దీనికి పేరు అనేది బాగా వచ్చింది. దానికి తోడు ఓ హీరోకి సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ ఈ షోకు యాంకర్ గా వచ్చిన తర్వాత రేటింగ్స్ అనేవి అమాంతం పెరిగిపోయాయి. ఇక ప్రతి ఆదివారం వచ్చే ఈ షోను చాలా మంది సుధీర్ కోసమే చూసేవారు. కానీ ఈ మధ్యే సుధీర్ ఈ షోను వదిలేసి వెళ్ళిపోయాడు అనే విషయం అందరికి తెలిసిందే.

Advertisement

అయితే తాజా సమాచారం ప్రకారం.. సుధీర్ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు కారణం ఈ షోలో మరో పాపులర్ ఫిగర్ అయిన హైపర్ ఆది చేసిన కామెంట్స్. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో అనేది విడుదల అయ్యింది. ఇందులో ఆషాడం మాసం అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఇక అందులో వర్షిణి రష్మీ దగ్గరకు వచ్చి.. అక్క నువ్వు ఇక్కడ.. బావ అక్కడ అంటూ కామెంట్స్ చేస్తుంది. ఇక అప్పుడే ఆది మధ్యలోకి వచ్చి అందరికి ఆషాడ మాసం అనేది ఒక్కే నెల అయితే రష్మీ, సుధీర్ కు మాత్రం ఒక్క సంవత్సరం అని పేర్కొన్నాడు.

Advertisement

ఇక ఆది వేసే పంచులు గురించి అందరికి తెలుసు. ఎప్పుడు సమయానికి తగినట్లు ఏదో విషయాన్ని చెప్పకనే తన పంచులు రూపంలో చెప్పేస్తాడు. ఇక ఇప్పుడు ఆది వేసిన పంచ్ విన్న తర్వాత… సుధీర్ ఒక్క ఏడాది తర్వాత మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రాబోతున్నాడా అనే అనుమానం అనేది అందరికి వస్తుంది. ఇక ఈ ఆది కామెంట్స్ తర్వాత రష్మీ సిగ్గు పడటం కూడా ఈ రకమైన అనుమానాలకు దారి తీస్తుంది. కేవలం ఒక్క ఏడాది కోసమే సుధీర్ ఈ షోను వదిలేసి వెళ్ళాడు అని తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఆది కామెంట్స్ వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో అనేది వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ భవిష్యత్తు ఈ రెండు సిరీస్లపైనే..!

గంగూలీ వల్లే ఇప్పుడు టీం ఇండియా ఇలా ఉంది..!

Visitors Are Also Reading