Home » త్రిష నుండి మహేష్ బాబు వరకు ఆచార్య ను మిస్ చేసుకున్న 5గురు స్టార్స్ ఎవరో తెలుసా..!

త్రిష నుండి మహేష్ బాబు వరకు ఆచార్య ను మిస్ చేసుకున్న 5గురు స్టార్స్ ఎవరో తెలుసా..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు.

Advertisement

సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే ఆచార్య సినిమాను పలువురు హీరోలు, హీరోయిన్లు మిస్ చేసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…

ఆచార్య సినిమా కోసం కొరటాల శివ ముందుగా అమితాబ్ బచ్చన్ ను అనుకున్నారట. కానీ నిర్మాత సుధాకర్ ఈ కథను చిరంజీవికి వినిపించాలని చెప్పారట. అలా కథ విన్న తర్వాత మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అంతేకాకుండా ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర కోసం మొదట కొరటాల శివ మహేష్ బాబు ను ఎంపిక చేశారట. మహేష్ బాబు కూడా ఈ సినిమాకు ఓకే చెప్పాడట. కానీ చిరంజీవి సతీమణి సురేఖ ఆ పాత్ర రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో చెర్రీని సినిమాలో ఫిక్స్ చేశారట.

Advertisement

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కొరటాల శివ జాహ్నవి కపూర్ ను అనుకున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాజల్ పై కొన్ని సీన్లను కూడా చిత్రీకరించారు. కాగా ఐదు రోజుల పాటు షూటింగ్ జరిగిన తర్వాత కాజల్ ను సినిమా నుండి తప్పించారు. సినిమాలో మెగాస్టార్ చేసిన నక్సలైట్ పాత్రకు లవ్ ట్రాక్ సెట్ కాదనే కారణంతోనే కాజల్ ను తొలగించామని కొరటాల చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఆచార్యకు నెగిటివ్ టాక్ రావడంతో వీళ్లంతా రిజెక్ట్ చేసి మంచి పని చేశారు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఆచార్య లో కాజల్ చేసిన పాత్ర కోసం మొదట త్రిషను అనుకున్నారు. ఈ సినిమాలో దాదాపు త్రిష ఖరారయ్యింది. కానీ ఆ తర్వాత సినిమా నుండి తను తప్పుకున్నట్టు ప్రకటించింది.

 

Also read :

గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన ప్ర‌భాస్ హీరోయిన్…వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

ACHARYA MOVIE REVIEW : ఆచార్య రివ్యూ అండ్ రేటింగ్ ..!

Visitors Are Also Reading