Home » గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన ప్ర‌భాస్ హీరోయిన్…వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన ప్ర‌భాస్ హీరోయిన్…వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

by AJAY
Published: Last Updated on
Ad

సాధార‌ణంగా సినిమాల్లోకి వ‌చ్చిన వారు అంత త్వ‌రగా సినిమాల‌కు దూరం అవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. సినిమా అంటే రంగుల ప్ర‌పంచం కాబట్టి ఇక్క‌డే విహ‌రించాల‌ని కోరుకుంటారు. అవ‌కాశాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటారు. ఆఫ‌ర్ లు వ‌స్తే ఫుల్ కుషీ అవుతారు. కానీ ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం కెరీర్ లో బిజీగా ఉన్న స‌మ‌యంలోనే సినిమాల‌కు గుడ్ బై చెప్పి అంద‌ర్నీ షాక్ కు గురి చేసింది.

Advertisement

 

ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు బొద్దుగుమ్మ రిచాగంగోపాద్యాయ‌. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన మిర్చి సినిమాతో రిచా క్రేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన‌ప్ప‌టికీ ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మిర్చి సినిమాలో అనుష్క కంటే రిచా గంగోపాధ్యాయ‌నే భాగుంద‌ని కూడా కొంత‌మంది భావించారు.

Advertisement

అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ మిర‌ప‌కాయ్ సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా న‌టించి కూడా ఆక‌ట్టుకుంది. మిర‌ప‌కాయ్ సినిమాలో హాట్ అందాల‌తో మ‌తిపోగొట్టింది. అయితే కెరీర్ లో అవ‌కాశాలు వ‌స్తున్న స‌మయంలోనే సినిమాలు దూరం అయ్యింది. ఇక 2013 లో భాయ్ సినిమాలో రిచా న‌టించింది. ఈ సినిమా త‌ర‌వాత సినిమాల‌కు దూరం అయ్యింది. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కానీ ఆ త‌ర‌వాత మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌లేదు.

త‌న స్నేహితుడు జోలాంగెల్లా అనే విదేశీయుడిని వివాహం చేస‌కుని అక్క‌డే సెటిల్ అయ్యింది. ఇక వీరిద్ద‌రికి ఇప్పుడు ఓ బాబు కూడా ఉన్నాడు. దాంతో రిచా రీఎంట్రీ ఇచ్చే అవకాశ‌మే లేద‌ని క్లారిటీ వ‌చ్చింది. ఇక ఎంతో అందంగా ఉండే రిచా ఇప్పుడు గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. తాజాగా రిచా త‌న భ‌ర్త‌తో క‌లిసి కొడుకుని ఎత్తుకుని దిగిన ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో రిచా బొద్దుగా జుట్టుకు రంగువేసుకుని క‌నిపిస్తోంది. దాంతో నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు.

Also Read: 

“ఆచార్య” లో యంగ్ చిరు దర్శనం….ఇదెక్కడి వీఎఫ్ఎక్స్ బాబోయ్ అంటూ నెట్టింట ట్రోల్స్…!

రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా వదులుకున్న కార్తీకదీపం నటి..!

Visitors Are Also Reading