తెలుగు సినిమా ఇండస్ట్రీని దేశ నలుమూలల గుర్తించే విధంగా చేసింది అన్న ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఆయన అపర భగీరథుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లో చేయని క్యారెక్టర్ లేదు.. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో కూడా రానించి తెలుగు రాష్ట్రానికే సీఎం అయ్యారు.
అప్పట్లో రాష్ట్ర ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలు సృష్టించి పేద ప్రజల దేవుడయ్యారని చెప్పవచ్చు.. ఒకప్పుడు తెలుగు భాష అంటే అందరికీ చిన్న చూపు ఉండేది అలాంటి భాషకు ఓ గుర్తింపు తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ తన రాజకీయ చతురతతో ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు తీసుకువచ్చారు. పేద ప్రజలకు ఎన్నో ముఖ్య పనులను చేశారు.
also read:వేల కోట్ల ఆస్తులున్నా అమల మెడలో తులం బంగారం ఉండదు…దాని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసా.?
టిడిపి పార్టీని స్థాపించి కొద్ది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని హరికృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి మహనీయున్ని ఇప్పటికి ఎవరు కూడా మరువలేరని అన్నారు.. ఆయన చేసిన మహోన్నతమైన పనుల గురించి, ఆయన బయటపెట్టారు.. సీనియర్ ఎన్టీఆర్ చేసిన మంచి పనుల గురించి ఆయన గురించి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎన్టీఆర్ చివరి కోరికను బయటపెట్టారు హరికృష్ణ.. హరికృష్ణ బతికున్న సమయంలో మీడియాతో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది