Home » ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్… రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్… రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాలు

by Bunty
Ad

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వివిధ ప్రభుత్వంలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకుగాను శ్రీకాకుళం లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

READ ALSO :  1964 లో “అంబాసిడర్” కారు ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

Advertisement

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.

* నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పిడియాట్రీషియన్(01), గైనకాలజిస్ట్ (02), మెడికల్ ఆఫీసర్ (22), డెంటల్ హైజినిస్ట్ (09), డెంటల్ టెక్నీషియన్ (01), క్లినికల్ సైకాలజిస్ట్ (01) కాళీలు ఉన్నాయి.

Advertisement

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లమా, ఎంబిబిఎస్, మెడికల్ పిజి ఉత్తీర్ణులై ఉండాలి.

READ ALSO : టాలీవుడ్ మరో విషాదం..సీనియ‌ర్ న‌టుడు ‘కాస్ట్యూమ్ కృష్ణ’ క‌న్నుమూత‌

ముఖ్యమైన విషయాలు…

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులకు అకాడమిక్ లో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆఫ్లైన్ దరఖాస్తులను శ్రీకాకుళంలోని జిల్లా వైద్యరోగ్య అధికారి ఆఫీసుకు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 06-04-2023 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

READ ALSO : జనసేన కోసం రానున్న ‘ఆహా’ దిన పత్రిక… ఈ పత్రిక ధర ఎంతో తెలుసా!

Visitors Are Also Reading