Home » స్పామ్ కాల్స్ వల్ల మీకు కోపం వచ్చిందా..? ఇందుకు పరిష్కారం ఇదేనా..?

స్పామ్ కాల్స్ వల్ల మీకు కోపం వచ్చిందా..? ఇందుకు పరిష్కారం ఇదేనా..?

by Anji
Ad

సాధారణంగా మీకు ఇన్ని లక్షల లోన్ మంజూరు అయింది అని, కంగ్రాట్స్ మీరు లక్కీ డ్రా గెలుచుకున్నారని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతుంటారు. చాాలా బిజీగా ఉన్నప్పుడు, రోజువారి పనుల్లో తలమునకలై ఉన్నప్పుడు , ఆఫీసుల్లో ముఖ్యమైన మీటింగుల్లో ఉన్నప్పుడు , ట్రావెల్స్ చేస్తున్నప్పుడు , లేదా ఇంటి పనుల్లో నిమగ్నమైనప్పుడు అకస్మాత్తుగా వచ్చే కాల్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆతృతతో పిక్ చేసే కాల్ మీ సహనాన్ని పరీక్షిస్తుంది. స్నేహితులతో లేదా సహచరులతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు మీ మధ్య సరదాగా సాగే సంభాషణను కట్ చేస్తూ ఇలాంటి కాల్స్ రావడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే.

Also Read : పాములు ఇళ్ల‌లోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

Advertisement

దాదాపు 64 శాతం మంది భారతీయులకు ప్రతిరోజూ సగటున మూడు లేదా అంతకు పైగా స్పాం కాల్స్ వస్తాయని మే 2022లో విడుదల చేసిన లోకల్ సర్కిల్స్ సర్వే అంచనా తెలిపింది. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అందరికీ ముందుగా ఎదురయ్యే ప్రశ్న: మన టెలిఫోన్ నంబర్ ఈ అపరిచిత సంస్థలు లేదా వ్యక్తుల దగ్గరకు ఎలా వెళ్ళింది? బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు? మన టెలిఫోన్ నెంబర్ ఎంతమంది అపరిచితుల దగ్గరకు చేరిందో ఊహిస్తే ఆందోళన కలగక మానదు. కొన్ని వందల, వేలమంది చేతుల్లోకి మన టెలిఫోన్ నెంబర్ చేరిపోయి ఉండవచ్చు. ఈ నెంబర్ తో పాటు మన వ్యక్తిగత వివరాలు, వయసు, ప్రాంతం, ఉద్యోగం, ఆదాయం, షాపింగ్ అలవాట్లు కూడా డేటా కూడా చాలామంది చేతుల్లోకి చేరి ఉంటుంది. మన సమాచారం సురక్షితంగా ఉందో లేదో తెలియదు. ఒకవేళ మన సమాచారం దుర్వినియోగం అయితే ఏమి చేయాలో కూడా తెలియదు. ఇదొక పెద్ద వలయం.

Also Read : ధూమ‌పానం కంటి ఆరోగ్యానికి ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌..!

కొన్నిసార్లు అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్ వల్ల మన బ్యాంక్ అకౌంట్లలో డబ్బు కూడా ఖాళీ అయిపోయే అవకాశం ఉంటుంది. సైబర్ మోసగాళ్లు మన వివరాలు సేకరించి అకౌంట్ లో డబ్బులు తీస్తారు. లేదా ఏదైనా లింకు పంపించి దానిపై క్లిక్ చేయమంటారు. అకౌంట్ లో డబ్బులన్ని ఖాళీ అయిపోతాయి. ఇటీవల భారత దేశంలో కైవైసి వివరాలు అప్ డేట్ చేయమంటూ 8000 మందికి లింకులు పంపిన మోసం చోటు చేసుకున్నట్లు ప్రింట్ వెబ్ పత్రికలో ప్రచురితమయింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ భారీ కుంభకోణంలో బాధితులు సుమారు రూ. 20 కోట్లు పోగొట్టుకున్నట్లు అంచనా. ఒక్కొక్కసారి మీరు దరఖాస్తు చేయని ఉద్యోగానికి ఎంపికయ్యారు అంటూ సందేశాలు వస్తూ ఉంటాయి. అందులో ఒక లింకు ఉంటుంది. అటువంటి లింకులను ఎప్పుడూ క్లిక్ చేయకూడదని సైబర్ నిపుణులు సూచిస్తారు.

Also Read : నయనతార సరోగసి ఎపిసోడ్ లో కొత్త మలుపులు ..? ఆ ఆధారాలను బయటపెట్టిన దంపతులు…!

మనం ఏదైనా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే వస్తువుల డెలివరీ సమయంలో డెలివరీ ఏజెంట్లు మన అడ్రస్ కోసం లేదా మనం ఇంటి దగ్గర ఉన్నామో లేదో తెలుసుకోవడం కోసం కాల్ చేస్తూ ఉంటారు. ఆ కాల్స్ లిఫ్ట్ చేయకపోతే, ఆ వస్తువు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం. టెలిమార్కెటర్ ఫోన్ నంబర్ కు ముందు 140 తో మొదలయ్యే ఒక సిరీస్ నంబర్ ఇస్తారు. ఉదాహరణకు ఢిల్లీ నుంచి వచ్చే కాల్స్ కు 14011తో మొదలవుతాయి. 140 తర్వాత ఆ ఏరియా కోడ్ ఉంటుంది. ఈ నంబర్ ద్వారా ఫోన్ చేస్తున్నది ఎవరో గుర్తించవచ్చు. ఉద్యోగం ఇస్తామని , బ్యాంకు వివరాలు ఇమ్మని , లక్కీ డ్రాలు గెలుచుకున్నారని , రుణాలు మంజూరు చేస్తామని వచ్చే కాల్స్ లేదా సందేశాల్లో మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు రామ్మోహన్ వివరించారు. నంబర్ ఎలా వచ్చిందో కాల్ చేస్తున్న టెలీకాల్ రిప్రజెంటేటివ్స్ కు కూడా తెలియదు. సదరు సంస్థల యాజమాన్యాలు వారికి ఇచ్చిన నంబర్లకు కాల్ చేయడం మాత్రమే వారి వీధి. ఉద్యోగులు ఒక సిరీస్ లో కాల్స్ చేస్తూ ఉంటానని చెప్పారు. ఇందులో ఉద్యోగుల ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఒకే సంస్థ నుంచి ఒకే రోజు మూడు, నాలుగు కాల్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి.

Also Read : రాజ‌బాబు కుమారులు దేశం గ‌ర్వించే స్థాయిలో స్థిర‌ప‌డ్డార‌ని తెలుసా..? ఏం చేస్తున్నారంటే..?

Advertisement

అవసరం లేని మార్కెటింగ్ సందేశాలను వినియోగదారులు బ్లాక్ చేయవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు 1909 ద్వారా వాయిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ చేసి కాల్స్ బ్లాక్ చేసుకోవచ్చు. రాయి డిఎన్డి 2.0 యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. టెలీ మార్కెటింగ్ ను రాత్రి 9 నుంచి ఉదయం 9 మధ్యలో చేయడానికి టెలికాం విధానం నిషేధిస్తోంది. బ్యాంకింగ్ , ఇన్సూరెన్స్ సేవలు, ఆర్థిక సేవలు, క్రెడిట్ కార్డులు, రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్యం, ఇతర వినియోగదారుల సేవలు, ఆటోమొబైల్స్ సేవలు, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, వినోదం, ఐటి, పర్యటకం, వినోదానికి సంబంధించిన కాల్స్ బ్లాక్ చేయవచ్చు. నేషనల్ కన్స్యూమర్ రెఫరెన్స్ రిజిస్టర్ లో నంబర్ నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసిన ఏడు రోజుల తర్వాత కూడా కాల్స్ వస్తే సదరు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఏ నంబర్ నుంచి కాల్ వస్తుందో, తేదీ, సమయం కూడా ఫిర్యాదులో తెలపాలి. నంబర్ ను పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేసే అవకాశాన్ని కూడా ట్రాయ్ నిబంధనలు కల్పిస్తున్నాయి. మూడు నెలల తర్వాత ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ట్రాయ్ డీఎండి లో నమోదు చేసుకున్న 95 శాతం మంది కాలర్లకు కూడా స్పామ్ కాల్స్ వస్తున్నట్లు లోకల్ సర్కిల్స్ సర్వే తెలిపింది.

Also Read : భార్య ఈ 3 రహస్యాలను భర్తకు అస్సలు తెలియనివ్వదు..ఇందులో 1 చాలా ఇంపార్టెంట్..!!

సాధారణంగా మన మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసిన బ్యాంకులు, ఇన్సూరెన్స్ తదితర సంస్థల నుంచి మాత్రమే కాల్స్ వస్తాయని అన్నారు. రిజిస్టర్ లో నమోదు చేసిన తర్వాత కూడా కాల్స్ వస్తే రూ. 2.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఇది మరింత కొనసాగితే , టెలికాం అధికారులు టెలీ మార్కెట్ ను పూర్తిగా నిషేధించే అధికారం కూడా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన డేటా సురక్షిత చట్టం లేదు. దీంతో, డేటా సేకరణ, అమ్మకం, షేర్ చేయడం విషయంలో ఎవరినీ బాధ్యులం చేయలేం” అని రామ్మోహన్ అన్నారు. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ పార్లమెంటులో ఆమోదం పొందలేదు. “ఈ డేటాను ఎలా ఉపయోగించుకుంటారో చెప్పాల్సిన అవసరం చట్టబద్ధంగా సంస్థలకు లేదు. ప్రజల అనుమతి లేకుండానే వారి డేటా షేర్ చేయవచ్చు”. స్పామ్ కాల్స్ వల్ల ప్రభావితమవుతున్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో ఉందని ట్రూ కాలర్ తమ గ్లోబల్ స్పామ్ రిపోర్ట్ 2021లోనే తెలిపింది. డేటా ఎలా లీక్ అయిందో కూడా తెలుసుకోవడం కష్టం. వ్యాపార సంస్థలు , కంపెనీలు డేటా సేకరించినప్పుడు ఆ డేటాను ఎలా వినియోగిస్తారో ఎవరికీ వెల్లడి చేయరు. వినియోగదారులు కూడా తమ డేటాను ఏ విధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నారనే విషయాలపై పెద్దగా దృష్టి పెట్టరు.

Alsu Read : విష్ణు పెళ్లిని మోహ‌న్ బాబు ఆ స్టార్ హీరో కూతురుతో జ‌రిపించాల‌ని అనుకున్నారా..?

ఇటువంటి కేసులు పరిష్కారమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని న్యాయ నిపుణులు అంటున్నారు. గత ఏడాది డోమినో సంస్థ 18 కోట్ల ఆర్ధర్లకు సంబంధించిన సమాచారం లీక్ అవడంతో భారీ డేటా బ్రీచ్ జరిగినట్లు ది ప్రింట్ పత్రిక పేర్కొంది. కొత్త డ్రాఫ్ట్ టెలికాం బిల్లు ఈ స్పామ్ కాల్స్ కు పరిష్కారం చూపిస్తుందా? కొత్త డ్రాఫ్ట్ టెలికాం బిల్లు కాల్ తీసుకునే వారికి కాల్ చేసే వారి వివరాలు కచ్చితంగా కనిపించాలననే నియమాన్ని పొందుపరిచింది. ఇది సాధరణ కాల్స్ కు మాత్రమే కాకుండా వాట్సాప్, జూమ్, ఫేస్ టైం కాల్స్ కు కూడా వర్తిస్తుంది. సైబర్ మోసాలను నియంత్రించేందుకు, యూజర్ల డేటా పరిరక్షణకు ఈ బిల్లులో అనేక చర్యలు తీసుకున్నట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతి యూజర్ కు ఉందని చెప్పారు. ఈ డ్రాఫ్ట్ పై వచ్చిన సూచనలను స్వీకరించిన ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం సమగ్రమైన డిజిటల్ విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తోందని అశ్విని వైష్ణ చెప్పారు వచ్చే 6-10 నెలల్లో ఈ బిల్లు చట్టంగా మారవచ్చు అని చెప్పారు. ప్రస్తుతం దేశంలో టెలీ కమ్యూనికేషన్ ను ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, ది వైర్ లెస్ టెలిగ్రాఫ్ చట్టం 1933 , టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం 1950 నియంత్రిస్తున్నాయి.

Also Read : Oct 8th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

 

Visitors Are Also Reading