Home » ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న శింబు మూవీ..!

ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న శింబు మూవీ..!

by Anji
Ad

తమిళ స్టార్ శింబు నటించిన లేటెస్ట్ మూవీ పత్తుతలా. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఎన్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, ప్రియా భవానీ శంకర్, గౌతమ్ మేనన్ ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. 

Also Read :  ప్రభాస్ సలార్ నుంచి క్రేజీ అప్డేట్.. అసలు కథ అదేనా ?

Advertisement

 

మార్చి 30న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. కన్నడలో ఘన విజయం సాధించిన మఫ్టీ సినిమాకు రీమేక్ గా పత్తుతలా తెరకెక్కిన విషయం విధితమే. ఈ సినిమా ఇప్పుడు ఒకేసారి రెండు ఓటీటీలలోకి రానుంది. ఈనెల 27న ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. 

Advertisement

Manam News

అమెజాన్ ప్రైమ్, సింప్లీ సౌత్ ఓటీటీలలో రానుంది. ఇసుక మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో శింబు ఏజీఆర్ గా నటించి మెప్పించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ విడుదల చేయలేదు. ఈ మూవీని ఎప్పుడు చూద్దామని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో కూడా తమిళ వెర్షన్ మాత్రమే ఉంటుందని ప్రకటించారు. రూ.35కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. 

Also Read :  BIG BOSSలోకి ఉదయభాను ఎవరితో కలిసి ఎంట్రీ ఇస్తుందో తెలుసా..?

Visitors Are Also Reading