Home » టీమిండియాలో నో ఛాన్స్​.. ఇక సీరియల్​లో నటిస్తున్న శిఖర్​ ధావన్​!

టీమిండియాలో నో ఛాన్స్​.. ఇక సీరియల్​లో నటిస్తున్న శిఖర్​ ధావన్​!

by Bunty
Ad

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు ఓపెనర్ గా సేవలు అందిస్తున్నాడు శిఖర్ ధావన్. అయితే శిఖర్ ధావన్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న దావన్ ను భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. రోహిత్ గైర్హాజరి నేపథ్యంలో పలు సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ధావన్ ఇప్పుడు పూర్తిగా జట్టులోనే చోటు కోల్పోయాడు.

READ ALSO : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి

Advertisement

దావన్ ని చివరగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా తరఫున ఆడాడు. అనంతరం అతడు స్థానాన్ని యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ తో సెలెక్టర్లు భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ధావన్ వ్యవహరించబోతున్నాడు. గత సీజన్ లో తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ స్థానంలో గబ్బర్ ను పంజాబ్ నియమించింది. ఈ ఏడాది సీజన్ కు ముందు మయాంక్ అగర్వాల్ ను పంజాబ్ విడిచిపెట్టింది.

READ ALSO : తండ్రి మరణంతో ఒంటరైన అమ్మ… తల్లికి మళ్లీ పెళ్లి చేసిన కొడుకులు

ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్ ఆరంభానికి ముందు ధావన్ ఓ హిందీ సీరియల్ లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. జీ ఛానల్ లో ప్రసారమయ్యే హిందీ సీరియల్ ‘కుండలి భాగ్య’లో ఓ పోలీస్ అధికారి పాత్రలో గబ్బర్ కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ధావన్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ధావన్ పోలీస్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!

Visitors Are Also Reading