Home » నువ్వు లేకుంటే నేను ఏమి చెయ్యగలను అంటూ పోస్ట్ ..! ఎవరిగురించి ?

నువ్వు లేకుంటే నేను ఏమి చెయ్యగలను అంటూ పోస్ట్ ..! ఎవరిగురించి ?

by Anji
Ad

నాగ‌చైత‌న్య విడాకులు అని ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత త‌న లైఫ్ స్టైల్ మొత్తాన్ని మార్చింది. ముఖ్యంగా ఈ మ‌ధ్య ఎక్కువ‌గా విహార యాత్ర‌ల‌కు వెళ్లుతుంది. ప‌లువురు ప్ర‌శ్నించగా కొన్ని జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోయేందుకు విహార యాత్ర‌ల‌కు వెళ్లుతున్న‌ట్టు కూడా ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. త‌న‌ను తాను స్ట్రాంగ్‌గా మార్చుకునేందుకు కెరీర్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. నూత‌న సంవత్స‌రం వేడుక‌ల కోసం శిల్పారెడ్డి, ఇత‌ర స్నేహితులతో క‌లిసి గోవా వెళ్లి అక్క‌డి బీచ్ అందాల మ‌ధ్య స‌మంత‌ ఎంజాయ్ చేసింది.

Advertisement

కెరీర్ ప‌రంగా కూడా చ‌కా చ‌కా ప్రాజెక్ట్‌ల‌ను ఓకే చేసి ముందుకు వెళ్లుతుంది. మ‌రొక‌వైపు సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టివ్ రోల్ పోషిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఎదుర‌య్యే త‌న లేటెస్ట్ అప్‌డేట్స్ నెటిజ‌న్ల ముందుంచుతూ తానేమిటో తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ త‌రుణంలోనే తాజాగా ల‌వ్ సింబ‌ల్‌తో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌వుతోంది.

Advertisement

Samantha shares a pic with friends

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని చాలా త‌క్కువ మందితో స్నేహంగా ఉండే స‌మంత క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్‌, త‌న స్నేహితురాలు చిన్మ‌యి, ఆమె భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ చాలా స‌న్నిహితంగా ఉంటుంద‌నే విష‌యం విధిత‌మే. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌, రాహుల్ రవీంద్ర‌న్‌ల‌తో క‌లిసి దిగిన ఓ ఫొటో షేర్ చేస్తూ నువ్వు లేకుంటే నేనేమి చేయ‌గ‌ల‌ను..? అని కామెంట్ పెట్ట‌డ‌మే గాక దానిపై స‌మంత‌ ల‌వ్ సింబ‌ల్ పెట్టేసింది. స‌మంత‌, వెన్నెల కిషోర్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ తో క‌లిసి ఒకేచోట క‌లిసి చిల్ అయిన‌ట్టు ఈ ఫొటో తో తెలుస్తుంది.

Visitors Are Also Reading