Home » విరాట్ కోహ్లీతో పవన్ కళ్యాణ్ పోలిక.. మెగా హీరోలపై సాయితేజ్ కామెంట్స్ వైరల్.. !

విరాట్ కోహ్లీతో పవన్ కళ్యాణ్ పోలిక.. మెగా హీరోలపై సాయితేజ్ కామెంట్స్ వైరల్.. !

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా విరూపాక్ష. ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి పరుగులు పెడుతోంది. ఈ తరుణంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read :  సీమంతం వేడుకలో ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?

Advertisement

ఈ వీడియోలో మెగా హీరోలను వారి వ్యక్తిత్వాలను క్రికెటర్లతో పోల్చారు సాయితేజ్. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలను క్రికెటర్స్ వారి స్వభావంతో పోల్చాల్సి వస్తే.. ఎవరినీ ఎవరితో పోల్చుతారని యాంకర్ ప్రశ్నించగా..  దీనికి తేజ్ చాలా క్రేజీగా రియాక్టయ్యాడు. ఇంతకి ఏ క్రికెటర్ ని ఏ మెగా ఫ్యామిలి హీరోతో పోల్చాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

విరాట్ కోహ్లీ దూకుడును పవన్ కళ్యాన్ తో పోల్చిన సాయి ధరమ్ తేజ్.. ధోని ప్రశాంతతను రామ్ చరణ్ తో పోల్చారు. హార్దిక్ పాండ్యా చమత్కారాన్ని తనతోనే పోల్చుకున్నాడు. జడేజా స్వాగ్ ని వైష్ణవ్ తేజ్ తో, రోహిత్ లేజీ అలెగెన్స్ ను వరుణ్ తేజ్ తో..అదేవిధంగా తిలక్ వర్మ యూత్ ఫుల్ ఎనర్జీని అల్లు అర్జున్ తో పోల్చారు.  ఈ టాఫిక్ జనాల్లో హాట్ ఇష్యూ అయింది. సాయితేజ్ సక్సెస్ అందుకున్న విరూపాక్ష సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. చాలా గ్యాప్ తీసుకొని వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఖాతాలో ఓ హిట్ పడటం పట్ల ఆయన అభిమానులు చాలా ఖుషీగా ఫీల్  అవుతున్నారు.  

Also Read :  బిచ్చ‌గాడు సినిమాను చేతులారా వ‌దులుకున్న‌ టాలీవుడ్ స్టార్ ఎవ‌రో తెలుసా..? ఎందుకు వ‌దులుకున్నారంటే..?

Visitors Are Also Reading