Home » పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?

పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?

by Bunty
Ad

సినీనటుడు సాయిధరమ్ తేజ..గురించి తెలియని వారుండరు. తాజాగా పవన్ కళ్యాణ్ మరియు సినీనటుడు సాయిధరమ్ తేజ..కాంబో లో బ్రో మూవీ వస్తోంది. ఈ మూవీ ఈ నెల 28 న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా కడపలోని పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు సినీనటుడు సాయిధరమ్ తేజ. అనంతరం మీడియాతో సాయిధరమ్ తేజ మాట్లాడుతూ.. ఇది నాకు పునర్జన్మ.. దేవుడు పునర్జన్మ ప్రసాదించారన్నారు.

Advertisement

అందుకే ఆలయాలను సందర్శిస్తున్నానని చెప్పారు. కడపకు వస్తే.. పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ అన్నారు. మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం మరువలేని అనుభూతి అని తెలిపారు సినీ నటుడు సాయిధరమ్ తేజ. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారని గుర్తు చేశారు. కానీ నేను సినీ రంగంలోనే ఉంటా.. మామయ్య కు అదే చెప్పానని వెల్లడించారు. మామయ్య పవన్ అంటే నాకు ప్రాణం అన్నారు సినీనటుడు సాయిధరమ్ తేజ.

Advertisement

ఇది ఇలా ఉండగా, సినీనటుడు సాయిధరమ్ తేజ..ఇవాళ ఓ వివాదంలో చిక్కు కున్నారు. శ్రీకాళహస్తి దేవాలయంలో ఉన్నటు వంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వయంగా సాయిధరమ్ తేజ్ హారతి ఇచ్చారు. అయితే… అర్చకులు కాకుండా సాయి ధరంతేజ్ హారతి ఇవ్వడంపై భక్తులతో పాటు హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక సామాన్యుడికి ఎలా అనుమతి ఇస్తారు అని ఆలయ అధికారులపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading