ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే ముందు నుంచి అనుకున్నట్టుగానే కొత్త మంత్రివర్గంలో సినీనటి నగరి ఎమ్మెల్యే రోజా కు కూడా అవకాశం దక్కింది. నేడు రోజా మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే రోజా టీవి కార్యక్రమాలలోనూ సినిమాలలోను బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు టీవీ కార్యక్రమాలను మరోవైపు రాజకీయాలను రోజా బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పదవి దక్కడంతో రోజా జబర్దస్త్ కు, టీవీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారనే ఊహాగానాలు ముందే మొదలయ్యాయి.
ఇక అంతా అనుకున్నట్టుగానే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రోజా తనకు మంత్రి పదవి లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సీఎం జగన్ పై అభిమానం రెట్టింపయ్యిందని అన్నారు. ముఖ్యమంత్రి తనకు ఏ పదవి కేటాయించినా సమర్థవంతంగా పని చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా రోజా సంచలన ప్రకటన చేశారు. ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు స్పష్టం చేశారు.
తను సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని ఈ సమయంలో సినిమాలకు సమయం కేటాయించలేనని వెల్లడించారు. మంత్రి అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకు వచ్చే పని చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా టిడిపి నేతలు తనను ఐరన్ లెగ్ అని ప్రచారం చేస్తే జగనన్న తనను మంత్రిని చేశారని అన్నారు. ప్రాణం ఉన్నంతవరకు జగనన్న కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
Also Read: ప్రియుడితో లేచిపోయిందనే రూమర్స్ను ఖండించిన రాజశేఖర్ కూతురు..
ఇదిలా ఉంటే జబర్దస్త్ ప్రారంభం నుంది రోజా జడ్జిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. షో సక్సెస్ లో ఆమె ముఖ్య పాత్ర పోషించారు. జబర్దస్త్ లో మొదట నాగబాబు రోజా లు జడ్జిలు గా వ్యవహరించగా కొంతకాలానికి నాగబాబు జబర్దస్త్ కు దూరమయ్యారు. ఇక ఇప్పుడు రోజా కూడా గుడ్ బై చెప్పడంతో తదుపరి జడ్జి ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: ఆనంద్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…ఏం చేస్తుందో తెలిస్తే శభాష్ అంటారు…!