Home » IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ దూరం… ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?

IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ దూరం… ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?

by Bunty
Ad

ఇవాల్టి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. క్రికెట్ అభిమానులకు ఇక సందడే సందడి. రెండు నెలల పాటు కాలాక్షపానికి డోకా లేదు. అద్భుతమైన క్యాచ్ లు, తక్కువ బాల్స్ లోనే సెంచరీలు, అత్యధిక స్కోరు నమోదు చేయడం, చివరి బంతి వరకు ఉత్కంఠ… ఇక సూపర్ ఓవర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కు టెన్షన్ తప్పదు. చివరి బాల్ వరకు ప్రతి మ్యాచ్ ఉత్కంఠ రేపుతుంది. ఇక మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.

read also : IPL 2023 : షారుఖ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వార్.. !

Advertisement

అయితే మ్యాచ్ కు ఒక రోజు ముందు గురువారం కెప్టెన్ ఫోటోషూట్ నిర్వహించారు. తొలి మ్యాచ్ కి వేదిక అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫోటోషూట్ జరిగింది. దీనిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగిలిన 9 జట్లకు చెందిన కెప్టెన్స్ హాజరయ్యారు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్క్రమ్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ షూట్ లో పాల్గొన్నారు.

Advertisement

Rohit Sharma Misses IPL 2023 Captains Meet, Sparks Speculation Ahead of Mumbais Opener | VIRAL PIC

అదేమిటంటే రోహిత్ శర్మ అనారోగ్యం కారణంగానే అహ్మదాబాద్ లో జరిగిన కెప్టెన్ ఫోటోషూట్ కి దూరంగా ఉన్నాడని ముంబై ఇండియన్స్ టీం వర్గాలు తెలిపాయి. అలానే బెంగుళూరుతో ఆదివారం జరిగే మ్యాచ్ కి అతను అందుబాటులో ఉంటాడని కూడా స్పష్టం చేశాయి. సమస్య చిన్నదేనని, ఫ్యాన్స్ కంగారు పడనవసరం లేదని టీం మేనేజ్మెంట్ తెలిపింది. దీంతో ఆటు ముంబై అభిమానులు, ఇటు హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా ముంబై, బెంగళూరు జట్లు ఆదివారం రాత్రి 7:30 నిమిషాలకు తలపడనున్నాయి.

READ ALSO : TS Constable : ఏప్రిల్‌ 2న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి

Visitors Are Also Reading