Home » ఇండియాను వాడుకుంటూ పాక్ ఫ్యాన్స్ ను విమర్శించిన రమీజ్..!

ఇండియాను వాడుకుంటూ పాక్ ఫ్యాన్స్ ను విమర్శించిన రమీజ్..!

by Azhar
Ad
ఇండియా – పాకిస్థాన్ కు ఏ విషయంలో కూడా పడదు అనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అదే ఇండియాను వాడుకుంటూ పాకిస్థాన్ ఫ్యాన్స్ ను విమర్శించాడు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజా. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో సెమిస్ కు చేరుకున్న పాక్.. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ లో ఫైనల్స్ లో ఓడిపోయింది.
అలాగే తాజాగా తన సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరిగిన 7 టీ20ల సిరీస్ లో కూడా 3-4 తేడాతో ఓడిపోయింది. దాంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు అనేవి వచ్చాయి. ఇక ఆ ట్రోల్స్ పైన రమీజ్ రాజా కౌంటర్ అనేది ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. మనం ఇంగ్లాండ్ తో ఆఖరి మ్యాచ్ లో బాగా ఆడక ఓడిపోయాము. క్రికెట్ లో అది సహజం.
అయితే ఆసియా కప్ లో మనతో పటు చాలా జట్లు పాల్గొన్నాయి. అందులో ఇండియా కూడా ఉంది. ఆ జట్టును కూడా సూపర్ 4 లో వరుస మ్యాచ్ లు ఓడిన తర్వాత అక్కడి ఫ్యాన్స్ బాగా విమర్శించారు. కానీ చివరి మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేయడంతో ఆసియా కప్ ఓటమిని వారు మర్చిపోయారు. అయితే ఇక్కడ కూడా బాబర్ సెంచరీ చేస్తే అంత మర్చిపోరు కదా.. అందులో కూడా తప్పులు వెతుకుతారు. అదే మనకు వారికీ తేడా అని రమీజ్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading