Home » ఇంకో రెండు బాల్స్ ఆడితే గెలిపించేవాడిని..!

ఇంకో రెండు బాల్స్ ఆడితే గెలిపించేవాడిని..!

by Azhar
Ad
భారత్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య నిన్న వన్డే సిరీస్ ప్రారంభం అయ్యిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో ఇండియా బరిలోకి దిగుతుంది. అయితే నిన్న జరిగిన మొదటి వన్డేలో ఇండియా 9 పరుగులతో ఓడిపోయింది. కానీ భారత బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రం తన కాన్ఫిడెన్స్ తో అభిమానులను మెప్పించాడు అనే చెప్పాలి.
ఈ మ్యాచ్ లో అర్ధ శతకం చేసిన శాంసన్ చివరి ఓవర్ లో 30 బంతులు కావాల్సిన ఉండగా.. 20  పరుగులు చేసాడు. ఇక మ్యాచ్ అనంతరం అతను మీడియాతో మాట్లాడుతూ.. నేను మరో రెండు బాల్స్ ను ఎక్కువ ఆడి ఉంటె ఇండియాను గెలిపించేవాడిని అని పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో చివరి 2 ఓవర్లలో 39 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ ఆఖరి రెండో ఓవర్ లో సంజూకి ఒక్క బాల్ కూడా రాలేదు.
శార్దూల్ ఔట్ ఐన తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ ఆటగాల్లో ఒక్కరు కూడా సింగిల్ తీసి సంజూకి బ్యాటింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. అందరూ భారీ షాట్స్ కు ఆడుతూ ఔట్ అయ్యి వేణు దిరిగిగారు. ఒకవేళ ఈ ఓవర్ లో సంజూకి బ్యాటింగ్ అవకాశం అనేది వచ్చి ఉంటె.. ఇండియా విజయం సాధిస్తుంది అనడంలో సందేహమే లేదు అని భారత క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading