Home » బీజేపీ గెలిస్తే గ్యాస్ సిలిండ‌ర్లు ఫ్రీ…కేంద్ర‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

బీజేపీ గెలిస్తే గ్యాస్ సిలిండ‌ర్లు ఫ్రీ…కేంద్ర‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

by AJAY
Ad

ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ప్ర‌జ‌లపై రాజ‌కీయ పార్టీలు వ‌రాలు జ‌ల్లులు కురిపించ‌డం కామ‌న్. ఇక ప్ర‌స్తుతం యూపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీలు ప్ర‌జ‌ల‌పై వ‌రాలు కురిపిస్తున్నాయి. కాగా తాజాగా బీజేపీ యూపీ పై ప‌ట్టు కోల్పోకుండా ఉండేందుకు బీజేపీ నేత‌లు కూడా వ‌రాలు కురిపిస్తున్నారు. తాజాగా యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ర‌క్ష‌ణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీజేపీకి ఓట్లు వేసి గెలిపిస్తే పండ‌గ‌ల స‌మ‌యంలో ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ల‌ను పంచుతామ‌ని చెప్పారు.

Advertisement

Advertisement

హోలీ దీపావ‌ళి మరియు ఇత‌ర పండ‌గ‌లు వ‌చ్చిన‌ప్పుడు ఫ్రీగానే గ్యాస్ సిలిండ‌ర్ ల‌ను అందిస్తామ‌ని రాజ్ నాథ్ సింగ్ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. స‌ర్వేలు పోల్స్ త‌మ‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని రామ్ నాథ్ కోవింద్ వెల్ల‌డించారు. ఈ సారి కూడా గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలే రిపీట్ అవుతాయ‌ని యోగి ఆదిత్యానాథ్ మ‌ళ్లీ సీఎం అవుతార‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మూడో ఫేజ్ ఎన్నిక‌లు 16 జిల్లాలు 59 అసెంబ్లీ స్థానాల‌కు జ‌ర‌గనున్నాయి.

Visitors Are Also Reading