Home » రవితేజ ఇంటికి వెళ్లి రచ్చ చేసిన రాజమౌళి.. జరిగింది ఏంటంటే…?

రవితేజ ఇంటికి వెళ్లి రచ్చ చేసిన రాజమౌళి.. జరిగింది ఏంటంటే…?

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ లోనే అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అంతేకాకుండా సినిమా సినిమాకి తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. ఇక బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు రాజమౌళి. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమా తో మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి తర్వాత ప్రాజెక్టుపై ప్రేక్షకుల కన్ను పడింది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మహేష్ బాబు మూవీ అనంతరం రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. అయితే దీనికి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా మాస్ మహారాజా రవితేజను రాజమౌళి కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నట్టు ఉండి రాజమౌళి రవితేజ ను కలవడం వెనుక కారణం ఏమిటనే విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో విక్రమార్కుడు సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రవితేజ కెరీర్ ని మలుపు తిప్పింది. అటు రాజమౌళి కూడా ఈ మూవీతోనే తన మార్కెట్ ను భారీగా పెంచేశారు. ఈ మూవీ అనేక భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీపై అప్పట్లోనే సీక్వెల్ ఉంటుందనే ప్రచారం కూడా సాగింది.

Advertisement

ఈ మధ్య కాలంలో త్రిబుల్ ఆర్ సక్సెస్ లో భాగంగా విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ ఉండబోతోందని దానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రాస్తున్నట్లు చెప్పారు. తాజాగా విక్రమార్కుడు సీక్వెల్ విషయంపై ఇటీవల రవితేజను రాజమౌళి కలిసి మాట్లాడినట్టు చర్చలు జరిపినట్లు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే రాజమౌళి సడన్ గా రవితేజను కలవడంతో ఈ టాక్ బయటకు వచ్చిందని తెలుస్తోంది. కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం రవితేజ అభిమానులకు మరో పండుగ అని చెప్పవచ్చు.

ALSO READ:

Visitors Are Also Reading