Home » పురందేశ్వరి: తప్పులు చేసేది మీరు.. మా మీద విమర్శలా..?

పురందేశ్వరి: తప్పులు చేసేది మీరు.. మా మీద విమర్శలా..?

by Sravya

వైసిపీ, కాంగ్రెస్ టీడీపీకి మేము చెప్పేది ఒక్కటే అని పురందేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు తప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు నాయకులు చేసి బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు పురందేశ్వరి. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఈమె ఈ సందర్భంగా మాట్లాడారు ఏకకాలంలో 25 పార్లమెంటు బిజెపి కార్యాలయాలని ఏర్పాటు చేసుకోవడం ఒక సువర్ణ అధ్యాయం అని అన్నారు. 2024 ఎన్నికల నగారా మోగించాం కార్యకర్తల్ని గౌరవించుకునే పార్టీ బిజెపి అని అన్నారు.

ఇద్దరు పార్టీ సభ్యులతో మొదలై 13 వేల ప్రాంతీయ ఏడు జాతీయ పార్టీల కంటే బిజెపి భిన్నమైంది అని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమం కోసం స్కీములు తీసుకువచ్చామని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో అవినీతి లేని పాలన అందించామని అన్నారు. పోలవరం జాతీయ హోదా కల్పించిన తర్వాత ప్రతి రూపాయి కేంద్రమే ఖర్చు చేస్తోందని పురందేశ్వరి అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading