Home » రాహల్ పై పగ తీర్చుకున్న పంజాబ్..!

రాహల్ పై పగ తీర్చుకున్న పంజాబ్..!

by Azhar
Ad

భారత జట్టులో ఓపెనర్ గా వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. అయితే రాహుల్ ప్రస్తుతం టీం ఇండియాలో చాలా కీలకం. అయితే ఇండియా భవిష్యత్ కెప్టెన్ కూడా అతనే అనే వాదన అనేది ఎప్పటి నుండో ఉంది. కానీ ప్రస్తుతం రాహుల్ అయితే బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం అవుతున్నాడు. ఇన్ని రోజులు కోహ్లీ బ్యాటింగ్ పై అందరి విచారం వ్యక్తం చేయగా.. ఇప్పుడు అది రాహుల్ వైపు తిరిగింది.

Advertisement

గత ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత గాయ పడిన రాహుల్ జట్టుకు దూరంగా ఉండి ఈమధ్యే జట్టుతో కలిసాడు. కానీ పరుగులు చేయలేకపోతున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఆసియా కప్ లో మొదట పాకిస్థాన్ పై గోల్డెన్ డక్ అయిన రాహుల్.. హాంగ్ కాంగ్ పైన 39 బంతుల్లో కేవలం 36 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దాంతో దొరికిందే సందుగా పంజాబ్ కింగ్స్ జట్టు రాహుల్ ట్రోల్ చేసింది.

Advertisement

అయితే ఐపీఎల్ 2021 వరకు పంజాబ్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ ఈ ఏడాది ఆ జట్టు నుండి తనకు తానే బయటకు వచేసాడు. ఆ కోపాన్ని లోపల ఉంచుకొని నిన్న రాహుల్ ఔట్ అయిన తర్వాత ”39 బంతుల్లో 36 పరుగులు చేసిన రాహుల్ సాలిడ్ ఇన్నింగ్స్ తర్వాత ఔట్ అయ్యాడు” అని ట్విట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ స్లోగా ఆడాడు అని అందరికి తెలుసు. కానీ కావాలనే సాలిడ్ అంటూ పంజాబ్ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

షాహీన్ ఆఫ్రిదీకి ఐపీఎల్ వేలంలో 15 కోట్లు..!

కోహ్లీ స్థానానికి సూర్య కుమార్ ఎసరు..?

Visitors Are Also Reading