Home » RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం  ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఈ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచి మొట్ట మొదటి భారతీయ సాంగ్ గా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇంతటి విజయంపై అందరూ సంతోషిస్తున్నారు. ఈ విజయం దక్కడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళినే. ముఖ్యంగా రాజమౌళి ముందుండి RRR చిత్రాన్ని, పాటను హాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేశాడు.

Also Read :  RRR ఆస్కార్ కొనేసిందని బాలీవుడ్ సెలెబ్రిటీ ట్వీట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Advertisement

ప్రమోషన్స్ కి దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారట. ఇంత ఖర్చు చేసినప్పటికీ.. RRR చిత్రం ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎక్కడ కూడా నిర్మాత డీవీవీ దానయ్య కనిపించలేదు. ఈ విషయంపై పలుమార్లు చర్చించిన కానీ ఎవ్వరూ కూడా స్పందించలేదు. ఆస్కార్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కనిపించాడు. ప్రమోషన్స్ కి కావాల్సిన ఖర్చుని శోభు కూడా కొంత మేరకు పెట్టుకున్నట్టు సమాచారం. RRR టీమ్ కి,  రాజమౌళికి, దానయ్యకి మధ్య అసలు ఏం జరిగింది అని అందరూ ఆలోచించారు. 

Advertisement

Also Read :  పెద్ద‌మ్మ‌త‌ల్లి ఆల‌యంలో ఆ హీరోతో క‌లిసి స‌మంత పూజలు..నెట్టింట వైరల్..!

Manam News

తాజాగా ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత కూడా అందరి మాదిరిగానే దానయ్య మీడియాతో మాట్లాడారు. RRR సినిమా రిలీజ్ తరువాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీమ్ ఎవ్వరితోనూ నేను కాంటాక్ట్ లో లేను. కానీ నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను” అని తెలిపారు. వీరి మధ్య కాంటాక్ట్ ఎందుకు లేదో మాత్రం చెప్పలేదు. ఈ ప్రమోషన్స్ కి కావాల్సినంత డబ్బులు దానయ్య ఖర్చుచేసేందుకు ఒప్పుకోకపోవడంతోనే రాజమౌళికి, దానయ్యకి మధ్య ఏదో జరిగి మాట్లాడుకోవడం లేదని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. మరీ ఇప్పటికైనా RRR టీమ్ ని నిర్మాత దానయ్య కలిసి అభినందలు చెబుతారో లేదో వేచి చూడాలి. 

Also Read :  ఆస్కార్ అవార్డు వచ్చింది ఎన్టీఆర్, చరణ్ లకు కాదు.. చంద్రబోస్ ఏమన్నారంటే..?

Visitors Are Also Reading