Home » ఆ పని చేయడం కోసం కిడ్నీలు అమ్ముకున్న బలగం హీరో…! వైరల్ అవుతున్న పోస్ట్..!

ఆ పని చేయడం కోసం కిడ్నీలు అమ్ముకున్న బలగం హీరో…! వైరల్ అవుతున్న పోస్ట్..!

by Mounika
Ad

బలగం మూవీతో ఒక్కసారిగా ప్రేక్షకులలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న  నటుడు ప్రియదర్శి. హీరోగా కన్నా ముందు ప్రియదర్శి జాతి రత్నాలు, ఎంసీఏ, పెళ్లిచూపులు, ఒకే ఒక జీవితం, ఉన్నది ఒకటే జిందగీ కమీడియన్ గా ప్రేక్షకులను మెప్పించారు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి టెర్రర్ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. తాజాగా హీరో ప్రియదర్శికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలలో దర్శి తన రెండు కిడ్నీలను అమ్ముకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించడంతో అందరూ అవాక్కవుతున్నారు.

Advertisement

అసలు ఇంతకీ ప్రియదర్శికి ఏం జరిగింది అనే విషయానికి వెళ్తే.. ప్రస్తుతం ప్రియదర్శి కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. ఇక తాజాగా దర్శి తన సోషల్ మీడియా ఖాతాలో షర్టు లేకుండా తన బాడీ కనిపించేటట్లు ఉండే ఒక ఫోటోని షేర్ చేయటం జరిగింది. ఆ ఫోటోలో దర్శి ఒంటిపై గాయం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ కావడంతో కిడ్నీలు అమ్ముకున్నావా బ్రో, ఇది నిజమైనా గాయమా.. లేక సినిమా కోసం పెట్టుకున్న గాయామా’’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ రూపంలో స్పందిస్తున్నారు.

Advertisement

ఇక మరికొందరేమో ఎక్కడైనా గొడవల్లో తలదుర్చావా ఏంటి.. మరికొందరేమో సినిమా షూటింగ్లో భాగంగా ఆ గాయం పెట్టుకున్నావా అని ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఏంటి బ్రో డబ్బులు లేకపోవడంతో రెండు కిడ్నీలు అమ్ముకున్నావా.. లేక కిడ్నీలు అమ్మేసి ఐఫోన్ కొన్నావా ఏంటి  అంటూ  నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రియదర్శి షేర్ చేసిన ఈ ఫోటో కారణంగా డబ్బులు లేకపోవటంతో ప్రియదర్శి కిడ్నీలు అమ్ముకున్నారంటూ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.

 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Savitri : మహానటి సావిత్రిని ఆర్థికంగా దెబ్బతీసిన చిత్రం ఏదో తెలుసా..!

పృధ్వీరాజ్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

“ఈ నగరానికి ఏమైంది..” యాడ్ లో నటించిన చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

 

Visitors Are Also Reading