Home » మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్లిపోయావ్… ఎమోషనల్ అవుతూ పవిత్రపై ఆషిక పోస్ట్..!

మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్లిపోయావ్… ఎమోషనల్ అవుతూ పవిత్రపై ఆషిక పోస్ట్..!

by Sravya
Ad

బుల్లితెర నటి పవిత్ర జయరాం గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆమె తన నటనతో అందరిని ఆకట్టుకుంది రీసెంట్ గా కారు యాక్సిడెంట్లో చనిపోయింది జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ లో తిలోత్తమ పాత్ర చేసి అందరికీ దగ్గర అయింది అయితే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అనే వార్తను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అభిమానులు తోటి నటులు అసలు తట్టుకోలేకపోతున్నారు. త్రినయనిలో హీరోయిన్ కంటే కూడా తిలోత్తమ రోల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ సీరియల్ లో హీరోయిన్ గా ఆషిక పదుకొనే నటించారు.

Advertisement

ఆమె బాధ పడుతూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోస్ ని ఫొటోస్ ని కలిపి ఒక పోస్ట్ పెట్టారు. తిలోత్తముగా మా షో కి ఎంతో ప్రాణం పోసావు. పవిత్ర జయరాం గా మా సెట్స్ కి హై ఎనర్జీని ఇచ్చావు. ఇంతలోనే మమ్మల్ని వదిలేసి పని మధ్యలోనే వదిలేసి అభ్యంతరంగా వెళ్లిపోయావు. నీతో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని నువ్వు లేని సీరియల్స్ ఎట్లోకి రావాలంటే కష్టంగా ఉందని భోజనం చేసేటప్పుడు నా ఎదురుగా లేకపోవడం తట్టుకోలేకపోతున్నాడని నాలుగేళ్లుగా కలిసి ఎంతో ఆనందంగా గడిపామని ఆమె వాటిని గుర్తు చేసుకోవచ్చు.

Advertisement

Also read:

అలాంటి క్షణాలు ఇక లేవని గుర్తొచ్చిన ప్రతిసారి కష్టంగా ఉంటుందని నీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యమని ఆమె రాసుకొచ్చారు. అలానే ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని ఒకసారి మా కోసం తిరిగి రా ప్లీజ్ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈమె చేసిన ఈ పోస్టుకి నెటిజెన్లు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading