మనిషా కొయిరాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఈమె నెల్లూరి నెరజాన తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో ఆమె నటించిన పలు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మనీషా కొయిరాలా ఒకప్పుడు తిరుగులేని అందం, అభినయం ఆమె సొంతం చేసుకుంది. మనిషా కు సరితూగే నటి అప్పట్లో మరొకరు లేరనే చెప్పాలి. బాంబే, ఇండియన్ వంటి సినిమాలతో తమిళంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న భామ మనిషా కొయిరాలా. నేపాల్ లోని సంపన్న కుటుంబంలో జన్మించింది మనిషా.
Advertisement
నేపాల్ లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన తొలి ప్రధాని మనవరాలే మనిషా కొయిరాల. అక్కడ రాజకీయ పరిస్థితులు దిగజారడంతో మనిషా తల్లిదండ్రులు వారణాసిలో స్థిరపడ్డారు. పదో తరగతి తర్వాత నేపాల్ నుంచి తిరిగి వచ్చిన మనిషా కొయిరాల ఓని అనే నేపాలి చిత్రం ద్వారా నటన ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మోడలింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. అలా పలు హిందీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ సాధించలేకపోయింది. ఆమెకు పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకొని వార్తలు నిలిచింది. నేపాల్ కి చెందిన సామ్రాట్ దాహల్ తో 2010లో పెళ్లి జరిగింది. పెళ్లయిన ఆరు నెలలకి వీరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి.. 2012లో విడాకులను తీసుకుంది.
పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నాను. కానీ ఆరు నెలలకి మాకు గొడవలు ప్రారంభం అయ్యాయి. తాను ప్రేమించిన భర్తీ తనకు శత్రువుగా మారాడు అంటూ గతంలో ఇంటర్వ్యూలు వెల్లడించింది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలా మారిపోయారు ఏంటి అంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మానసిక ఒత్తిడికి గురై మద్యానికి బానిసగా మారింది మనిషా కొయిరాల దీనికి తోడు ఆమె పెళ్లి విడాకులతో మరింత డిప్రెషన్కు గురైంది ఆ తర్వాత తాగడం మొదలుపెట్టిన మనిషా కొయిరాలా ప్రవర్తన అంతా మారిపోయింది పార్టీలు మద్యపానం తన జీవితంలో భాగమైపోయాయని స్వయంగా తానే చెప్పుకొచ్చింది. మరోవైపు క్యాన్సర్ వ్యాధితో కూడా పోరాడి గెలిచింది. పోరాటం కొత్త జీవితాన్నిచ్చిందని మనిషా కొయిరాలా తన ఆత్మకథ హీల్డనే పుస్తకంలో ప్రస్తావించింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా ?