Home » ప్రభాస్‌ ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చిన ఓమ్ రౌత్‌…!

ప్రభాస్‌ ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చిన ఓమ్ రౌత్‌…!

by Azhar
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి సినిమాతో ఈ రేంజ్ తెచ్చుకున్నా ప్రభాస్… ఆ తర్వాత చేసిన రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రజలను అంతగా ఆకట్టుకోలేదు. అందులో మొదట వచ్చిన సాహో… హిందీలో కొంచెం పర్లేదు అనిపించినా.. ఈ ఏడాది వచ్చిన రాధే శ్యామ్ మాత్రం పూర్తిగా డిజాస్టర్ అయ్యింది. అందువల్ల ప్రబస్ తర్వాతి సినిమా కోసం అభిమానులు తెగ వెట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఒక్కేసారి నాలుగు సినిమాలను అనౌన్స్ చేసాడు.

Advertisement

అందులో ఇప్పుడు రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ఒక్కటి ఆదిపురుష్.. మరొకరి సాలార్. అందువల్ల ప్రభాస్ సినిమా విడుదల సంగతి తర్వాత కానీ.. ఆ సినిమా నుండి ఎప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిపురుష్ నుండో ఓ అప్డేట్ రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇందులో హీరోయిన్ గా సీత పాత్రలో నటిస్తున్న హీరోయిన్ కృతి సనన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె మొదటి లుక్ అనేది విడుదల చేయనున్నారు అని తెగ ప్రచారం జరిగింది.

Advertisement

కానీ అవి అన్ని గాలి వార్తలే అని ఈ సినిమా దర్శకుడు ఓమ్ రౌత్‌ తెలిపారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… కృతి ఫస్ట్ లుక్ ఇప్పుడు విడుదల కావడం లేదు అని చెప్పారు. అలాగే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ అనేది ముగించుకొని.. ఇప్పుడు సాలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్స్ చేస్తున్నారు అని అన్నాడు. అలాగే ఇంతకముందు చెప్పిన విధంగానే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి తప్పకుండా విడుదల చేస్తాం అని… ఇప్పుడు ఆదిపురుష్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతున్నట్లు ఓమ్ రౌత్‌ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలవలేదు…!

మురళి విజయ్ కు బుద్ధి చెప్పిన ఫ్యాన్స్..!

Visitors Are Also Reading