Home » మురళి విజయ్ కు బుద్ధి చెప్పిన ఫ్యాన్స్..!

మురళి విజయ్ కు బుద్ధి చెప్పిన ఫ్యాన్స్..!

by Azhar
Ad

ఈ మధ్య కాలంలో భారత వెటరన్ టెస్ట్ ఓపెనింగ్ బ్యాటర్ మురళి విజయ్ బాగా చర్చలో ఉంటున విషయం తెలిసిందే. కానీ అది అతని ప్రదర్శన కారణంగా కాదు. విజయ్ ఒక్కపుడు టెస్టులో ఓపెనింగ్ బ్యాటర్ గా ఉండేవాడు. కానీ ఆ తర్వాత రోహిత్ శర్మ టెస్టులోకి వచ్చిన తర్వాత అతని స్థానం అనేది పోయింది. అయితే ఇప్పుడు మురళి విజయ్ గురించి ఎక్కువ చర్చ అనేది జరగడానికి కారణమ్ దినేష్ కార్తీక్. అయితే ధోని సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎక్కువ అవకాశాలు అనేవి కార్తీక్ కు రాలేదు. కానీ ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చిన.. 2019 ప్రపంచ కప్ తర్వాత దినేష్ ను పూర్తిగా పక్కన బెట్టారు.

Advertisement

అయిన కుల పట్టువదలని దినేష్ కార్తీక్… దేశవాళీ టోర్నీలలో బాగా రాణించాడు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తరపున అదిరిపోయే పరఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. అందువల్ల మళ్ళీ టీం ఇండియాలో చోటు దకించుకున్నాడు. ఇక ఇలా 37 ఏళ్ళ వయస్సులో టీం ఇండియాలోకి రావడంతో దినేష్ కార్తీక్ క్రికెట్ కెరియర్.. అలాగే పర్సనల్ లైఫ్ గురించి బాగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో దినేష్ కార్తీక్ ను అతని మొదటి భార్య నిఖిత అలాగే అతని స్నేహితుడు మురళి విజయ్ చేసిన మోసం అనేది ఎక్కువగా ట్రెండ్ అయ్యింది.

Advertisement

దినేష్ కార్తీక్ భార్య నిఖితతో మురళి విజయ్.. వివాహేతర సంబంధం అనేది పెట్టుకున్నాడు. అందువ్ల వారు విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మురళి విజయ్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఆ క్రమంలోనే తాజాగా జరిగిన మ్యాచ్ లో మురళి విజయ్ కి ఫ్యాన్స్ బుద్ధి చెప్పారు. అతను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటే.. అందరూ దినేష్ కార్తీ పేరు అనేది అరవడం ప్రారంభించారు. అలా చేయకండి అంటూ మురళి విజయ్.. వెన్నకి తిరిగి దండం పెట్టినా కూడా వారు ఆగలేదు. ఇక ఈ ఘటనను ఒక్కరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ట్రెండ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

వన్డే ఫార్మట్స్ లో ఓవర్లను కుదించనున్నారా…?

సెంచరీలు చేసినప్పుడు మాట్లాడలేదు… ఇప్పుడు కూడా మాట్లాడకూడదు..!

Visitors Are Also Reading