Home » NTR: స్వర్గీయ ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన 10 అద్భుతమైన పథకాలు ఏవో తెలుసా ?

NTR: స్వర్గీయ ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన 10 అద్భుతమైన పథకాలు ఏవో తెలుసా ?

by Anji
Ad

నంద‌మూరి తార‌క రామారావు…తెలుగు వారికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.! ఆయ‌న ప్ర‌స్థానం రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ మైలురాయి! ఆయ‌న ప‌రిపాల‌న స‌రికొత్త మార్పుకు శ్రీకారం !

sr ntr photos

sr ntr photos

ధైర్యమైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాదు.. కేంద్రాన్ని సైతం ధైర్యంగా ప్ర‌శ్నించిన ధీశాలి….NTR. ఆ మ‌హానీయుడు త‌న పాల‌నాకాలంలో తీసుకొచ్చిన కొన్ని కొత్త ప‌థ‌కాలు రాష్ట్రాభివృద్దిని స‌మూలంగా మార్చేశాయి. ఇత‌ర రాష్ట్రాలు సైతం అన్న ప్ర‌వేశ‌పెట్టిన‌ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కొనియాడాయి.

Advertisement

Also Read: రాజేంద్ర‌ప్రసాద్ మాళ‌విక మ‌ధ్య అస‌లేం జ‌రిగింది…ఆమెను ఎందుకు బ్యాన్ చేశారు..!

2 రూపాయ‌ల‌కే కేజీ బియ్యం


1983 లో త‌ను అధికారంలోకి రాగానే …పేద‌వాడి క‌డుపునింపాల‌నే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను స్టార్ట్ చేశారు. అప్ప‌ట్లో ఇదో సంచ‌ల‌నం. కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఈ స్కీమ్ ను కొనియాడింది.

మ‌ద్య‌పాన నిషేదం

పేద‌ల సంపాద‌న తాగుడుకే స‌రిపోతుంద‌న్న కార‌ణంతో మ‌ద్య‌పాన నిషేదాన్ని తీసుకొచ్చాడు.

ఎంసెట్

ఇంట‌ర్ అవ్వ‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే ఎంసెట్ ఇంప్లిమెంట్ చేసింది అన్న నంద‌మూరి తార‌క‌రామారావు.

ప‌టేల్ ప‌ట్వారీ విధానం ర‌ద్దు

గ్రామ భూముల రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను త‌మ చేతుల్లో పెట్టుకుని పేద రైతుల‌ను అనేక క‌ష్టాల‌కు గురి చేస్తున్న ప‌టేల్‌, ప‌ట్వారీల అధికారాల‌ను తొల‌గిస్తూ ఓ గొప్ప నిర్ణ‌యం తీసుకొని పేద రైతుల‌కు ఆనందాన్ని పంచాడు.

ఎంజీబీఎస్ బ‌స్టాప్


నిజాం కాలంలో అంకురార్ప‌ణ జ‌రిగిన ఇమ్లీబ‌న్ బ‌స్టాండ్‌ను పూర్తి స్థాయిలో నిర్మించి ఆసియాలోనే పెద్ద‌బ‌స్టాప్ ఎంజీబీఎస్ ను తీర్చిదిద్దారు.

Advertisement

నెక్లెస్ రోడ్డుపై మ‌హానీయుల విగ్ర‌హాలు హుస్సెన్ సాగ‌ర్‌లో బుద్ధ విగ్ర‌హం

నెక్లెస్ రోడ్డు చుట్టూ ఉన్న తెలుగు వీరుల విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయించి ఎన్టీఆర్ హ‌యాంలోనే. తెలుగు ఖ్యాతిని సంస్కృతి, చ‌రిత్ర స్ప‌ష్టం అయ్యేలా ఈ విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయించారు. హుస్సెన్ సాగ‌ర్‌లో టీవీగా నిల్చున్న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసింది కూడా ఎన్టీఆర్ కావ‌డం విశేషం.
5 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణం

పేద‌ల కోసం త‌న ఐదేండ్ల ప‌రిపాల‌న కాలంలో 5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించాడు. ఎంతో మంది పేద‌ల‌కు గూడును క‌ల్పించారు ఎన్టీఆర్‌.

Also Read :  క‌రాటే క‌ళ్యాణి రెండు పెళ్లిళ్ల క‌థ గురించి మీకు తెలుసా..?
శాస‌న మండ‌లి ర‌ద్దు

ప్ర‌భుత్వానికి వృథా ఖ‌ర్చుగా కొన‌సాగుతున్న శాస‌న మండ‌లిని ర‌ద్దు చేసాడు. ఇది ఒక విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యం. కానీ మ‌ర‌ల దీనిని పున‌రుద్ధ‌రించారు.

పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం

విద్యావ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌డానికి పేద విద్యార్థుల‌ను చ‌దువు వైపు ప్రోత్స‌హించే విధంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం ప్రారంభించారు.

స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు సైతం రాజ‌కీయాల్లో ఎద‌గాల‌ని స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్ల‌ను తీసుకొచ్చారు ఎన్టీఆర్‌.

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్ త‌రలింపు ఎన్టీఆర్ హ‌యాంలోనే జ‌రిగింది. అంత‌కు ముందు మెల్ల‌మెల్ల‌గా జ‌రిగినా.. పూర్తి స్థాయిలో మాత్రం ఎన్టీఆర్ పీరియ‌డ్‌లోనే మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చింది తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ.

Also Read :  ఆ స‌మ‌యంలో అల్లుఅర్జున్ ను న‌య‌న‌తార అవ‌మానించిందా..?

Visitors Are Also Reading