Home » నిఖిల్ కు బుద్ధి చెప్పిన దర్శక నిర్మాతలు..!

నిఖిల్ కు బుద్ధి చెప్పిన దర్శక నిర్మాతలు..!

by Azhar
Ad
నిఖిల్ సిద్ధార్థ.. ఈరోజు కార్తికేయ 2 సినిమాతో ఫ్యన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అనేది 2014 లోనే వచ్చిన కార్తికేయ అనే సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఇక ఆ మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాపైన కూడా అందరూ అంచనాలు బాగానే పెట్టుకున్నారు. ఇదిలా ఉంటె.. తన ధరి నుండి పక్క ధరి పట్టబోతున్న నిఖిల్ కు కొంతమంది దర్శక నిర్మాతలు బుద్ధి చెప్పినట్లు తెలుస్తుంది.
అయితే కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్న నిఖిల్.. కొన్ని ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఇక అదే సమయంలో తాను అనౌన్స్ చేసిన ఓ సినిమా గురించి చెప్పాడు. కరీనా కంటే ముందు,, నిఖిల్ తాను ఓ సినిమాను డైరెక్ట్ చేబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ సినిమా పూర్తిగా చిన్న పిల్లలతోనే ఉంటుంది అని కూడా చెప్పాడు. కానీ అది ఇంకా రాలేదు.
ఇక ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడిన నిఖిల్… ఆ సినిమా కథ అనేది కూడా పూర్తయింది. అలాగే కాస్టింగ్ కూడా ప్రారంభించాను. కానీ అప్పుడు నాకు కొంతమంది దర్శక నిర్మాతలు క్లాస్ పీకారు. ఇప్పుడు హీరోగా మంచిగా కొనసాగుతున్నావ్. నువ్వు డైరెక్టర్ అయితే మళ్ళీ ఎవరు హీరోగా ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు మొత్తం హీరోగా ని కెరియర్ పైనే ఫోకస్ పెట్టు అని వారు చెప్పారు. అందుకే ఆ సినిమాను పక్కకు పెట్టాను ఐ నిఖిల్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading