Home » పంత్ పరువు తీసిన ఊర్వశీ…!

పంత్ పరువు తీసిన ఊర్వశీ…!

by Azhar
Ad

ప్రస్తుతం టీం ఇండియాను పంత్ ఏ మ్యాచ్ లో గెలిపించకపోయిన కూడా అతని పేరు ట్రేండింగ్ లో ఉంటుంది. అందుకు కారణం ఓ సోషల్ మీడియా వాగ్వాదం. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటెల, రిషబ్ పంత్ ల మధ్య ఇప్పుడు జరుగుతున్న మతాల యుద్ధం అనేది అందరికి తెలిసిందే. గతంలో ఎప్పుడో పంత్ తన కోసం హోటల్ లో మూడు గంటలు వేచి ఉన్నాడు అని ఊర్వశీ మొదట చెప్పింది.

Advertisement

ఇక దానికి పంత్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాడు. కొంతమంది వార్తలో ఉండాలని.. ఫెమస్ కావాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ ఓ స్టోరీ పెట్టాడు పంత్. అలాగే చివర్లో నన్ను వదిలేయ్ అక్క అంటూ రాసుకొచ్చాడు. అది కాస్త వైరల్ కావడంతో కాసేపటి తర్వాత దానిని డిలీట్ కూడా చేసాడు. ఇక పంత్ పెట్టిన స్టోరీని ట్రెండ్ చేస్తూ ప్రజలు ఇష్టం వచ్చిన కథలను ఉహించుకుంటున సమయంలో తాజాగా పంత్ పరువు తీసేసేలా ఊర్వశీ ఓ పోస్ట్ చేసింది.

Advertisement

ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా ఊర్వశీ తన ట్విట్టర్ లో.. చోటు భాయ్.. నువ్వు బ్యాట్, బల్ తో ఆడుకో. నేను ఏం మున్నిని కాదు.. నీలాంటి పిల్లల చేతిలో బద్నామ్ కావడానికి. రక్ష బంధన్ శుభాకాంక్షలు ఆర్పి భాయ్ అంటూ పోస్ట్ చేసింది. ఇక ఇందులో ఆర్పి అంటే రిషబ్ పంత్ అనేది అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఊర్వశీకి పంత్ సమాధానం ఇస్తాడా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్…!

ముంబైకి షాక్ ఇచ్చిన సచిన్ కొడుకు..!

Visitors Are Also Reading