Home » ఏపీ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల కొత్త షెడ్యూల్ ఇదే..!

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల కొత్త షెడ్యూల్ ఇదే..!

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు విడుద‌ల చేసింది. గ‌తంలో షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌గా.. జేఈఈ మెయిన్స్, ఇంట‌ర్మీడియ‌ట్‌ప‌రీక్ష‌ల కార‌ణంగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స‌ల్వ మార్పులు చేసింది. దీంతో కొత్త షెడ్యూల్ ను ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కాసేప‌టి క్రితం విడుద‌ల చేసింది. ఈ కొత్త షెడ్యూల్ ప్ర‌కారం.. ఏపీలో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఏప్రిల్ 27వ తేదీ స్టార్ట్ కానున్నాయి. అదేవిధంగా మే 09 తేదీతో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పూర్తి కానున్నాయి.

Advertisement


ఏప్రిల్ 27 తేదీన తెలుగు ప‌రీక్ష ఉండ‌నున్న‌ది. అదేవిధంగా ఏప్రిల్ 28వ సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఏప్రిల్ 29న ఇంగ్లీషు, మే 02న గ‌ణితం, మే 04న సైన్స్ పేప‌ర్ -1, మే 05న సైన్స్ పేప‌ర్ 2, అదేవిధంగా మే 06న సోష‌ల్ స్ట‌డిస్ ప‌రీక్ష కూడా ఉండ‌నున్న‌ది. ఏప్రిల్ 30తో పాటు మే 01వ తేదీల‌లో సెల‌వు దినాలు. మే 03న రంజాన్ ఉండ‌డంతో సెల‌వు ఉండ‌నున్న‌ది.

Advertisement

Also Read :  మీట‌ర్ లో పాము.. తృటిలో త‌ప్పించుకున్న క‌రెంట్ ఆఫీస‌ర్‌..!

Visitors Are Also Reading