Home » ఏటీఎంలో డబ్బులు తీయాలంటే ఇక అందరూ దీనిని ఫాలో కావాల్సిందే…?

ఏటీఎంలో డబ్బులు తీయాలంటే ఇక అందరూ దీనిని ఫాలో కావాల్సిందే…?

by Azhar
Ad
ఒక్కపుడు ప్రజలు డబ్బులు అనేవి విత్ డ్రా చేయాలి అనుకుంటే బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చిన ఏటీఎం సర్వీస్ అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఏటీఎం సర్వీస్ ను ఉపయోగించుకొని ప్రజలు ఎలాంటి కష్టం అనేది లేకుండా నిమిషాల వ్యవధిలో డబ్బు అనేది తీస్తూ.. తమ పనులను చేసుకుంటున్నారు. అయితే ప్రజల సౌకర్యం కొత్త తెచ్చిన ఈ ఏటీఎం సర్వీసులను కేటుగాళ్లు తమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు.
ఒక వ్యక్తి యొక్క ఏటీఎం కార్డు అనేది ఏ కేటుగాడు చేతికి అయిన చిక్కితే అందులో నుండి మొత్తం డబ్బు అనేది తామా తెలివి తేటలను ఉపయోగించి కొట్టేసుతున్నారు. ఇలా చాలా మంది ప్రజలు తమ డబ్బు అనేది పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రకమైన మోసాలకు చెక్ పెట్టేందుకు ఎస్బిఐ బ్యాంక్ ఓటీపీ సిస్టమ్ ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిస్టమ్ ప్రకారం ఎవరైనా ఎస్బిఐ యూజర్.. తన కథ నుండి ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేయాలనీ అనుకుంటే.. వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. అప్పుడు పిన్ తో పాటుగా ఆ ఓటీపీ ని కూడా ఎంటర్ చేస్తేనే డబ్బు అనేది వస్తుంది.
అయితే ఎస్బిఐ ఈ పద్దతిని తీసుకువచ్చి ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది. 2020 జనవరి 1 నుండే ఈ పద్దతిని వాడుతుంది ఎస్బిఐ. దీని వల్ల చాలావారకు మోసాలు అనేవి అరికట్టవచ్చు. దాంతో ఇప్పుడు మిగిలిన బ్యాంకులు కూడా ఏటీఎం విత్ డ్రా విషయంలో ఇదే సిస్టమ్ ను వడబోతున్నట్లు తెలుస్తుంది. ఏ యూజర్ అయిన ఏటీఎం నుండి పది వేల కంటే ఎక్కువ డబ్బును తీయాలి అని చూస్తే.. అతనికి ఒక్క ఓటీపీ అనేది వస్తుంది. దాని ద్వారానే అతను డబ్బు అనేది విత్ డ్రా చేయవచ్చు. ఇక ఈ ఓటీపీ కేవలం ఒక్కసారి నిర్ణిత సమయం వరకే ఉంటుంది. ఇక ఈ పద్దతి ద్వారా ఏటీఎం అనేది కేటుగాళ్లకు చీకినా కూడా తక్కువ మొత్తంలో పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Visitors Are Also Reading