Home » ఇండియా విజయానికి సంజూనే కారణం..!

ఇండియా విజయానికి సంజూనే కారణం..!

by Azhar
Ad

భారత జట్టు ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో చాల బిజీగా ఉంది. అయితే అక్కడ ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ లో పోటీ పడుతున్న భారత జట్టు ఆ తర్వాత టీ 20 సిటీస్ లో పోటీ పడుతుంది. అయితే ఇప్పుడు ఆడుతున్న ఈ వన్డే సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు… 2-0 తో సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి వచ్చిన టీం ఇండియాకు మొదట్లోనే షాక్ తగ్గిలింది. కేవలం 79 పరుగులకే ముఖ్యమైన మూడు వికెట్లను చేకార్చుకుంది భారత జట్టు.

Advertisement

కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. అలాగే సంజూ శాంసన్ మంచి భాగసౌమ్యం నెలకొల్పారు. ఇక చివర్లో అక్షర్ పటేల్ అద్భుతమైన హాఫ్ సెంచరీ అనేది చేయడంతో ఇండియా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడానికి ముఖ్య కారణం సంజూ శాంసన్ అని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం శ్రేయాస్ మాట్లాడుతూ… మేము మొదట్లోనే వికెట్లను తొందరగా కోల్పోయాం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నేను, సంజూ కలిసి మంచి ఇన్నింగ్స్ అనేది నెలకొల్పాలి అనుకునం. మేము అనుకున్న పద్ధతిలోనే మొదట్లో స్లోగా ఆడాం.

Advertisement

ఇక మేము క్రీజులో కుదురుకున్న తర్వాత కేవలం స్పిన్నర్లను టార్గెట్ చేయాలని ప్లాన్ చేసాం. అయితే అప్పుడే సంజూ ఒక్కే ఓవర్లో రెండు సిక్సులు అనేవి కొట్టిన తర్వాత మ్యాచ్ అనేది మా వైపు వచ్చింది. ఈ మ్యాచ్ లో సంజూ ఆడిన ఇన్నింగ్స్ వెలకట్టలేనిది. అది జట్టులో నమ్మకం అనేది తీసుకువచ్చింది. మేము ఇద్దరం ఉన్నంతసేపు విజయం సులువు అనుకున్నం. కానీ మేము ఇద్దరం తొందరగా ఔట్ కావడంతో మ్యాచ్ కొంచెం కష్టం అయ్యింది. కానీ చివర్లో అక్షర్ మెగా ఫినిష్ చేసాడు అని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు. ఇక ఈ రెండు జట్ల మద్యం మిగిలిన మూడో మ్యాచ్ ఈ నెల 27వ తేదీన విడుదల అవుతుంది.

ఇవి కూడా చదవండి :

ధావన్ ను అసలు జట్టులోకి ఎలా తీసుకున్నారు…?

పాండ్య రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పిన రవిశాస్త్రి..!

Visitors Are Also Reading