మెగా డాటర్ నిహారిక కొణిదెల మూడేళ్ల దాంపత్య జీవితానికి జులై 04న సాయంత్రంతో బ్రేక్ పడింది. డిసెంబర్ 09, 2020న వీరిద్దరి పెళ్లి ఉదయపూర్ ప్యాలెస్ లో బంధువులు, సన్నిహితుల మధ్య వైభవంగా పెళ్లి వేడుక జరగ్గా.. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం.. దంపతులిద్దరి పరస్పర అంగీకారంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.
Advertisement
గత కొంతకాలంగా మనస్పార్థాల కారణంగా దూరంగా ఉంటున్న ఈ జంటపై సోషల్ మీడియాలో వీరిద్దరి విడిపోతున్నారంటూ రూమర్స్ రాగా.. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఈ విషయంపై స్పందించలేదు. అయితే చివరికీ ఆ రూమర్స్ వాస్తవం అయ్యాయి. ఇటీవలే కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక, చైతన్య ఇద్దరూ డైవర్స్ కి అప్లై చేయగా.. కోర్టు వీరిద్దరి అభ్యర్థనను స్వీకరించి విడాకులు మంజూరు చేసింది. నిహారిక విడాకుల విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి జరిగిన మూడేళ్లకే డైవర్స్ తీసుకోవడమేంటి అంటూ.. నిహారిక పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Advertisement
భార్య, భర్తల కంటే గొడవలు అవుతుండటం కామనే. కానీ ఇలా గొడవ అయిన ప్రతిసారి డైవర్స్ తీసుకుంటే జీవితాంతం పెళ్లిళ్లు, విడాకులు తీసుకుంటూనే ఉండాలంటూ నెటిజన్లు నిహారిక పర్సనల్ లైఫ్ పై కామెంట్ చేసారు. సినిమాల కోసం భర్తను వదిలేయం ఏంటని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. ఈ కామెంట్స్ పై స్పందించిన నిహారిక ఓ నోట్ ను విడుదల చేసింది. చైతన్య.. తాను ఒకరినొకరు పరస్పర ఇష్టంతోనే విడాకులు తీసుకున్నామని ఆమె ఈ నోట్ లో రాసుకొచ్చింది. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దంటూ మాకు కొంచెం ప్రైవసీ కావాలంటూ.. తాను మళ్లీ సాధారణ జీవితం గడపడానికి అందరి మద్దతు కావాలంటూ నోట్ లో పేర్కొంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదేనా..?