Home » తిరుపతి నుంచి నిహారిక పోటీ.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

తిరుపతి నుంచి నిహారిక పోటీ.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు ఎన్నికల హడావిడి ప్రచారం నడుస్తున్న వేళలో.. మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మార్చి 01న ఆపరేషన్ వాలంటైన్ సినిమా విడుదల కానుండగా.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఈ రోజు రాజమండ్రిలో పర్యటించిన హీరో వరుణ్ తేజ్.. సినిమా విషయాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల పోటీ పై క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఎన్నికల్లో పోటీ పై మా కుటుంబంలో పెద్దవాళ్ల నిర్ణయమే మా నిర్ణయం అన్నారు వరుణ్ తేజ్. ఎన్నికల్లో మా కుటుంబంలో పెద్దవారి నిర్ణయమ ఫైనల్ అని చెప్పారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వరుణ్.. పెద్దనాన్న చిరంజీవి, నాన్న నాగబాబు, బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే చేస్తామన్నారు. మా అవసరం ఉన్నది అనుకుంటే ఎన్నికల ప్రచారానికి వస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు.. మా కుటుంబం అంతా బాబాయ్ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటామని చెప్పుకొచ్చారు. మేము పొలిటికల్ గా ఏం చేయాలనుకున్నా పెద్ద నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని వివరించారు.

Advertisement

అనకాపల్లి నుంచి నాన్న నాగబాబు పోటీ చేస్తే ప్రచారానికి వెళ్లడం పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి నిహారిక పోటీ చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారం పై కూడా క్లారిటీ ఇచ్చారు వరుణ్. నిహారిక తిరుపతి నుంచి పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారంలో  వాస్తవం లేదని స్పష్టం చేశారు. మార్చి 01న ఆపరేషన్ వాలంటైన్ మూవీ రిలీజ్ చేస్తున్నాం.. మిలటరీ మాధవరం వెళ్లి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపాడు వరుణ్ తేజ్.

Also Read :  ఒక‌టి రెండూ కాదు…..ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుద‌ల చేసిన ద‌మ్మున్న హీరోలు వీళ్లే..!

Visitors Are Also Reading